Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

International Yoga Day: చిట్యాల ఉన్నత పాఠశాల చిట్యాల లో యోగ అవగాహన సదస్సు

International Yoga Day: ప్రజా దీవెన చిట్యాల: యోగ, మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి విద్యార్థినీ విద్యార్థులు ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగా అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ మండల కేంద్రంలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పాఠశాల విద్యార్థులచే, యోగా కార్యక్రమాలు చేయించడం జరిగింది కొన్ని రకాల ట్రిప్స్ ఆసనాలు వేయించి మెడిటేషన్ చేయించారు. పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ 15వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చిట్యాల లో ఈ యొక్క యోగ కార్యక్రమాలు ఉదయం 9 గంటలకు చేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి గారు సూచనలు సలహాలు తెలిపారు.

యోగా మెడిసిన్ చేయడం సంతోషకరమని, మనసును తన ఆధీనంలోకి తీసుకురావడమే మెడిటేషన్ అన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామం టీచర్ జానకి గారిచే చే వామప్, యోగాసనాలు వేయించడం జరిగింది. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా ధ్యానం మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారు. శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి చెందుతారన్నారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి యోగ, మెడిటేషన్లకు ఉన్నదని, విద్యార్థులు చదువులలో రాణించాలంటే ప్రతినిత్యం యోగా మెడిటేషన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాఠశాలల ఉపాధ్యాయులు మరియు చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొనేటి యాదగిరి, , మేడ బోయిన శ్రీను, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.