Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suicide: బెట్టింగ్‌లకు అలవాటు పడి, మన స్థాపంతో యువకుడు ఆత్మహత్య

Suicide: ప్రజా దీవెన, ఆదిలాబాద్: బెట్టింగ్‌కు యువకుడి బలైన ఘట న ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసు కుంది. జైనాథ్ మండలం పిప్పర్‌ వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి, డబ్బులు పోవడం వల్ల మన స్థాపం చెందాడు. అభ్యుదయ పాఠ శాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్ప డ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బెట్టింగ్‌ యువతకు వ్యస నంగా మారింది. చేతిలో ఆండ్రా యిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు బెట్టింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లో కూర్చొనే ఆడుకుంటున్నారు.

మనీ వాలెట్‌ను డౌన్లోడ్‌ చేసు కుని అందులోకి బ్యాంకు ఖాతా, ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసు కుంటున్నారు. ఈ బెట్టిగ్ కాయ్ రాజా కాయ్ అంటూ తన వలలో వేసుకుంటోంది. బెట్టింగ్ భూతం జనం ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ మాయదారి రక్కసిని ఖతం చేసేం దుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాప కింద నీరులా తన పని కానిస్తూనే ఉంది. ఈ బెట్టింగ్ మోజులో అమా యక యువకులు త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంట్లో తెలియకుండా స్నేహితుల వద్ద అప్పులు చేసి పందేలు కాస్తున్నా రు. తీరా ఓడిపోవడంతోనట్టేట మునుగుతున్నారు. చేసిన అప్పుల కు వడ్డీలు చెల్లిస్తూ.. మనస్థాపానికి గురవుతున్నారు. ఆదాయం లేక, ఇంట్లో అడగలేక, మళ్లీ అప్పులుచే యలేక ఏం చేయాలో అర్థంకాక పోవడంతో ప్రాణాల మీదికి తెచ్చు కుంటున్నారు.