Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suryapet District SP Narasimha: నకిలీ విత్తనాలు విక్రయిస్తే జైలుకే

— సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ

Suryapet District SP Narasimha: ప్రజా దీవెన,సూర్యాపేట: సూర్యా పేట జిల్లాలో జిల్లా లో నకిలీ పత్తి విత్తనాలనురైతులకు విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు. మంగ ళవారం జిల్లా ఎస్పీ కార్యాల యం లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో ఆయన కేసు వివ రాల ను వెల్లడించారు. మోతె పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు నిందితులు, త్మకూర్ ఎస్ పోలీస్ స్టేషన్ కేసులో నలుగురు నిందితులు రిమాండ్ రి మాండ్ చేసినట్టు ఆయన తెలిపా రు. అరెస్టు చేసి వారి నుంచి రూ.6 5 లక్షల విలు వగల 22 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చే సుకున్నమన్నారు.

ఆత్మకూర్.ఎస్ మండలం కేసులో తండ నగేష్, పంది రాము, బాణోతు జయరాం, తరిగొప్పుల శ్రీనివాసరావును అరె స్టు చేసి రిమాండ్ కు పంపగా ఏ1 అయిన అరుణోదయ నకిలీ పత్తి విత్తనాల కంపెనీ ఎండీ మాగులూరి సాంబశివరావు, ఏ6 చెవుల నర్సిం హులు పరారీలో ఉన్నట్టు తెలిపా రు. మోతె మండలం రావిపహాడ్ గ్రామానికి చెందిన వెలుగు శ్రీను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చర్లపల్లి శాతవాహన అనే ఇద్దరి అరెస్టు చేశారు. వీరికి ఈ వి త్తనాలు సరఫరా చేస్తున్న మరో వ్య క్తి కర్ణాటక రాష్ట్రం నలుగునూర్ కు చెందిన తిరుమల్గా గుర్తించమన్నా రు. ప్రస్తుతం తిరుమల్ పరారీలో ఉండన్నారు.ఈ సమావేశంలో అద నపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యా పేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీసీ ఎస్ ఇన్ స్పెక్టర్ శివ కుమార్, సూ ర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, మో తే ఎస్ఐ యాదవెందర్ రెడ్డి, ఆత్మ కూరు ఎస్ఐఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.