Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana All Hamali Workers Federation: హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

–మార్చి 21 ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా

–దండంపల్లి సత్తయ్య

Telangana All Hamali Workers Federation: ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : సంఘటిత అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మార్చి 21న ఇందిరాపార్క్ దగ్గర జరుగు మహాధర్నా జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండ పట్టణం నెహ్రు గంజి లో నల్లగొండ పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ కార్యాలయం దగ్గర మార్చి 21 చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ దఃగరా జరుగు మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల తరహా లో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇండ్లు లేని అమాలీలకు భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం ఇచ్చి హమాలీ నగర్ లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం, 50 సంవత్సరాలు నిండిన అమాలీలకు నెలకు 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి 15 నెలలు గడిచిన అతీగతీలేదని అన్నారు.

2025 – 26 రాష్ట్ర బడ్జెట్లో హమాలీ సంక్షేమానికి హమాలీల ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాకు నల్గొండ జిల్లా నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఔరేశ్ మారయ్య, కార్యదర్శి కాడింగు రవికుమార్, సభ్యులు నాగరాజు, వీరబాబు, బక్కయ్య, సతీష్, పోషాలు, వెంకన్న అశోక్ రాజు నరసింహ తదితరులు పాల్గొన్నారు.