Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Bonalu 2025: అమ్మవారి బోనాలు జాతరకు సమయం ఆసన్నం

–గురువారం నుంచి నెల రోజుల పాటు గోల్కొండ కోటలో ఉత్సవాలు
–తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు బోనాల జాతరే జాతర
–రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల వద్ద అవసరమైన ఏర్పాట్ల పూర్తి

Telangana Bonalu 2025: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జ రుపుకొనే బోనాల ఉత్సవాలకు రం గం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీన గురువారం నుంచి ప్రారంభం కాను న్న బోనాల జాతర ఉత్సవాలు జులై 24వ తేదీ వరకు నెల రోజుల పాటు వైభవోపేతంగా కొనసాగను న్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అధి కారిక పండుగగా ప్రకటించిన విష యం తెలిసిందే. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకో వడం ఆనవాయితీగా వస్తుంది.ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరు పుకొనే బోనాల ఉత్సవాలు గురు వారం ప్రారంభమై నెల రోజుల పా టు ఈ ఉత్సవాలు కొనసాగనున్నా యి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల వద్ద అవసరమైన ఏ ర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది.

గోల్కొంట కోటలో బోనాలు మొదట ప్రారంభించే సంప్రదాయం కులీ కు తుబ్‌షా కాలం నుంచి వస్తుంది. అ ప్పట్లో కులీకుతుబ్‌షా నిర్వహించ గా, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వ ర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వ హిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న అమ్మవారికి పట్టువస్త్రాలు అం దజేస్తుంది. బోనాలు ఉత్సవాలకు దేవాదాయశాఖ ఆధ్వర్యంలోని శ్రీజ గదాంభిక ట్రస్టు బోర్డు ఏర్పాట్లు మొ దలుపెట్టింది.

నెలరోజుల జాతర గురువారం నుం చి జూలై 24వతేదీ వరకు తెలం గా ణలో బోనాల జాతర జరుగనుంది. నెలరోజుల పాటు ఇక్కడ తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలకు నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది భ క్తులు రానున్నారు. వీరికోసం గో ల్కొండ కోటలోని అక్కన్న మాదన్న కార్యాలయాలు, బాడిగా ర్డ్స్‌ లైన్స్‌ ప్రాంతాలు సిద్ధం చేస్తున్నారు.

పూజల ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి రోజు లంగర్‌హౌజ్‌ చౌరస్తా నుంచి అమ్మవారి తొట్టెల ఊరేగిం పు నిర్వహిస్తారు. చోటాబజార్‌లోని ఆలయం పూజారి ఇంటి నుంచి అ మ్మవారి విగ్రహం, ఘట్టం ఊరేగిం పు, బంజారాదర్వాజ నుంచి మొద టి బోనం ఊరేగింపు నిర్వహిస్తారు. ఇవన్నీ గోల్కొండ కోటపైకి చేరిన త ర్వాత ఆలయం ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, బోనం అమ్మవారి క సమర్పిస్తారు.

ఆ రెండు రోజులు ఆల్ ఫ్రీ…కోటలో బోనాల జాతర జరుగనుండడడం తో గోల్కొండ కోట పాలన చూస్తు న్న కేంద్ర పురావస్తు శాఖ పలు మా ర్పులు చేయనుంది. బోనాలు జరిగే ఆదివారం, గురువారం రోజుల్లో ఉ చిత ప్రవేశం కల్పించారు. కోటలో ప్ర తీ రోజు రాష్ట్ర పర్యాటక సంస్థ రెం డు లైట్‌ అండ్‌ సౌండ్‌ షోలు నిర్వ హిస్తుంది. ఆదివారం, గురువారా లు మొదటి షోను రద్దు చేస్తారు. రెండవ షో 8 గంటల నుంచి యధా విధిగా ఉంటుంది.

*సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలో..* బోనాలు సంప్రదాయం ప్రకారం ప్రసిద్ధి చెందిన గోల్కొండ కోటలోని శ్రీఎల్లమ్మ ఆలయంలో ప్రారంభం కావడం ఆనవాయితీ. ప్రతీ సంవత్సరం ఆషాడమాసంలో ఆమావాస్య తర్వాత వచ్చే గురు వారం, లేదా ఆదివారం బోనాలు ప్రారంభవవుతాయి. అయితే, ఈ నెల బుధవారం అమవాస్య కావ డంతో ఆ తర్వాత రోజు గురువారం బోనాల జాతర మొదలుకానుంది. అయితే జూన్‌ 26న మొదటి పూ జ, జూన్‌ 29న రెండవ పూజ, జూ లై 3న మూడవ పూజ,జూలై 6న నాల్గవ పూజ, జూలై 10న ఐదవ పూజ, జూలై 13న ఆరవపూజ,
జూలై 17న ఏడవ పూజ, జూలై 20న ఎనిమిదవ పూజ, జూలై24న తొమ్మిదవ పూజలు జరుగనున్నా యి.