Telangana Government : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ కళ్యాణ్ నగర్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కేసు లో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరిం చింది. కళ్యాణ్ నగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1964 లో యూ సుఫ్ గూడ విలేజ్ లోని సర్వే నెం 128/1, 128/10 లో 38 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా అ ట్టి భూమి 1972 నుండి ఆక్రమణ లకు గురవుతూ వచ్చింది. 1988 లో సంబంధిత హౌసింగ్ సొసైటీ భూ ఆక్రమణలపై జె.టి.గౌడ్ తో సహా 502 మంది పై భూ వివాదాల కోర్టులో కేసు నమోదు చేయగా అ ట్టి సొసైటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.
కళ్యాణ్ నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు 1997 లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం సొసైటీకి నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయగా, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జీహెచ్ ఎంసీ సుప్రీం కోర్టులో అప్పిల్ చేయ డం జరిగింది. అట్టి కేసును రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ తరఫు న సీనియర్ న్యాయవాదులు ఐశ్వ ర్య బాటి, మేనక గురుస్వామిలు వాదించారు. హైకోర్టు ఆదేశా లు అమలు చేసినట్లైతే రాష్ట్ర ఖజానా పై రూ. 2వేల కోట్ల అద నపు భారం పడేదని, తమ వాదన లతో వాస్తవాలను సుప్రీం కోర్టులో వినిపించగా, వారి వాదనల తో ఏకీ భవించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు నిచ్చింది. భూ ఆక్రమణదారుల నుండి పరి హారం మొత్తాన్ని రికవరీ చేసి సొసై టీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు లో బెంచ్ ముందు సీని యర్ న్యాయవాదులు తమ బల మైన వాదనలు వినిపించడంతో ప్రభుత్వానికి 2వేల కోట్ల రూపా యల అదనపు భారం పడకుండా అనుకూలంగా తీర్పు వచ్చింది.