Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Terror Attack : కేంద్రం కీలక నిర్ణయం, పహల్గామ్ ఉగ్రదాడి కేసు ఎన్ఐఏకి అప్పగింత

Terror Attack :ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. పహల్గామ్‌లో ఇటీవల జ రిగిన ఘోర ఉగ్ర దాడి కేసు దర్యా ప్తు బాధ్యతలను జాతీయ దర్యా ప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించిం ది. ఈ దాడిలో ఒక నేపాల్ జాతీ యుడితో సహా మొత్తం 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన వి షయం విధితమే. కేంద్ర హోం మం త్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కే సును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవే క్షించారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన తీవ్రత దృ ష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ ఐఏకి అప్పగించాలని నిర్ణయించిం ది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందా లు పహల్గామ్‌లోని ఘటనా స్థలం లో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్ష ణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.