— ఆదేశాలు జారీ చేసిన కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి
Tinmar Mallanna Suspension: ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవ ర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మ ల్లన్నను సస్పెండ్ చేశారు. ఈమేర కు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్ర వర్తించడమే కాకుండా బీసీ కులగ ణన ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మల్లన్నకు ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కోరినా.. మల్లన్న నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. మల్లన్నను ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాలేదన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయిందన్నారు. మల్లన్న చేసిన వాఖ్యలు చాల తప్పు అని ఆయన పేర్కొన్నారు.
ఏఐసీసీ నిర్ణయం మేరకే తీన్మార్ మల్లన్న సస్పెండ్ : టీ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్పై టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారికి ఇది ఒక హెచ్చరిక అని ఆయన తెలిపారు. భవిష్యత్లో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆ పార్టీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలపై మల్లన్నను కమిటీ వివరణ కోరింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు వివరణ ఇవ్వాలని మల్లన్నకు కమిటీ గడువు ఇచ్చింది. వివరణ ఇవ్వకపోవడంతో తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది.