Drinking water problem: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఇకపై గ్రామీణ తాగునీటి స మస్య ఫిర్యాదుల కోసం నాలుగు అంకెల టోల్ ఫ్రీ నంబర్ కేటాయిం చిది ప్రభుత్వం. ప్రజలకు సులువు గా గుర్తుండేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఆదేశాల మేరకు 11- అంకెల టోల్ ఫ్రీ నంబర్ స్థానంలో 1916 తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చాక ఈ టోల్ ఫ్రీ ద్వా రా వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది సత్వరం ప రిష్కరి స్తోంది.మిషన్ భగీరథ శాఖలో ప్రజ ల గ్రామీణ తాగునీటి సమస్య ఫి ర్యాదులను పరిష్కరించడానికి 1800-599-4007 (11-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ ఇక పై అందుబాటు లో ఉండనుంది. మిషన్ భగీరథ ఈ టోల్ ఫ్రీ నంబర్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉపయోగించు కుంటున్నారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, పైన చూ పిన 11-అంకెల టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయడంలో ఇబ్బందిని ఎ దుర్కొంటున్నందున, మిషన్ భ గీరథ విభాగం గ్రామీణ ప్రజల తాగు నీటి సమస్య ఫిర్యాదులను నమో దు చేసుకొనడానికి ప్రస్తుతం ఉన్న 1800-599-4007 (11-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ కు బదులుగా నా లుగు అంకెల 1916 (4-అంకెల) నంబర్ తో ఫిర్యాదులను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించడం జరి గింది. ఈ నాలుగు అంకెల 1916 (4-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ తో ప్రజ లు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా త మ తాగునీటి సమస్య ఫిర్యాదుల ను నమోదు చేసుకోవచ్చని ప్రభు త్వం తెలియజేసింది.