–ప్రజాప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు అమలు
–ఏ పదవిలో ఉన్నా క్రమశిక్షణతో పనిచేశా
–25 ఏండ్ల నుంచి పార్టీకోసం శ్రమించాను
–టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య
TPCC Vice President Kondeti Mallaiah: ప్రజాదీవెన నల్గొండ ; కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. టీసీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మొదటిసారి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొన్నేండ్లుగా తాను పార్టీకి పనిచేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని టీపీసీపీ ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, సీనియర్ నేత జానారెడ్డికి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్మహేష్ కుమార్గౌడ్ కు, ఎంపీ రఘువీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 25ఏండ్లనుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా, ఏ కార్యక్రమం అప్పజెప్పినా నిబద్ధతతో పనిచేశానని, గత పదేండ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథాకాలలో పేదలకు లబ్ధిచేకూరలేదని, అలా అమలు కానీ ఎన్నో పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తోందని అన్నారు. మంత్రి పదవులతో పాటు, పార్టీ పదవులు కేటాయించడంలో పార్టీ సామాజిక న్యాయం పాటించిందని అన్నారు. 3
0 ఏండ్లనుంచి పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణను పూర్తిచేశారని, బీసీ కులగణన చేపట్టారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మీ పథకం, గ్యాస్ సబ్సిడీ, రైతు రుణమాఫీ వంటి అనేక పథకాలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తోందని చెప్పారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు, మంత్రి పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తోందని అన్నారు. తాజాగా జరిగిన టీపీసీసీ కార్యకవర్గంలోనూ సామాజిక న్యాయమే ఎజెండాగా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు చోటు కల్పించడపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఓసీలకు పార్టీ రాష్ట్ర పదవుల్లో చోటుకల్పించడం గర్వకారణమని అన్నారు. ఎమ్మెల్సీలు విషయంలోనూ నల్లగొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చిందని చెప్పారు. పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న కార్యకర్తలను పార్టీ హైకమాండ్ గుర్తిస్తుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త కష్టపడి, గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తనకు అప్పగించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ద్వారా నిబద్ధతతో పనిచేశానని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసి గెలుపునకు కృషిచేశానని చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, విద్యార్థి నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, దళిత, ఎమ్మార్పీఎస్ నాయకులు వచ్చి ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.