Trump : ప్రజా దీవెన, వాషింగ్టన్ డిసి: అమె రికాలో అక్రమ వలసలపై ట్రంప్ ప్ర భుత్వం వరుస ప్రత్యక్ష చర్యలకు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి గా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్ప టి నుంచి అక్రమ వలస ల పై దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నా రు. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారుల్ని పట్టుకుని బలవం తంగా స్వదేశాలకు పంపిస్తున్నా రు. తాజాగా 5 లక్షల మంది వల సదారుల తాత్కాలిక నివాస హో దాను అమెరికా రద్దు చేసింది ట్రం ప్ ప్రభుత్వం. త్వరలో వారంతా బహిష్కరణకు గురికానున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు అక్రమ వలసదారులపై ట్రం ప్ వేటు వేస్తున్నారు. తాజాగా క్యూబా, హైతీ, నికరా గ్వా, వెనిజులాకు సంబంధిం చిన 5లక్షల మందికి పైగా వలసదా రులకు పెరోల్ కార్యక్రమాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది.
ఒక నెలలో వారిని బహిష్కరించే అవ కాశం ఉందని హోంల్యాండ్ సెక్యూ రిటీ విభాగం శుక్రవారం తెలిపింది. ఈ ఆర్డర్ అక్టోబర్ 2022 నుంచి అమలవుతుందని తెలిపింది. ఈ నాలుగు దేశాల నుంచి దాదాపు 5,32,000 మంది వచ్చినట్లుగా గుర్తించింది. వీళ్లంతా అమెరికా నుంచి బహిష్కరణకు గురికాను న్నారు. వీళ్లంతా తొలుత ఆర్థిక స్పాన్సర్లతో పాటు రెండేళ్లు నివా సించడానికి పని చేయడానికి అను మతి పొందారని హోంల్యాండ్ సెక్యూ రిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ పేర్కొన్నారు. వీళ్లంతా దాదాపు 30 రోజుల్లో చట్టపరమైన హోదా కో ల్పోతారని తెలిపింది.మానవతా పెరోల్ కింద అమెరికాకు వచ్చే వా రు రెండేళ్ల పాటు చట్టబద్ధంగా దే శంలో ఉపాధి పొందొచ్చు. ఆ గడు వు ముగిసిన తర్వాత మరింత ఎ క్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దర ఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చి న తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియ ను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు దేశాలకు సంబంధించిన 5 లక్షల నివాసాలను అమెరికా రద్దు చేసింది.