Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TS UTF State Secretary Rajasekhar Reddy: విద్యాశాఖలో అక్రమ డిప్యుటేషన్లు వెంటనే రద్దు చేయాలి

–టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి

TS UTF State Secretary Rajasekhar Reddy: ప్రజాదీవెన నల్గొండ : విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి అధ్యక్షతన ఆఫీస్ బేరర్ సమావేశం జరిగింది. ఈ సమావేశనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొంతమంది ఉపాధ్యాయులు రాజకీయ నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిప్యూటేషన్లకు వెళుతున్నారు.

వారు పీఏ పల్లి, అడవిదేవులపల్లి, చండూరు, గుడిపల్లి లాంటి మండలాల అదేవిధంగా హైవే ప్రాంతాలైన కట్టంగూరు, నకిరేకల్, కేతపల్లి మండలాలకు అక్రమంగా డిప్యూటేషన్ పై రావటం జరుగుతుందని తెలిపారు. ఈ డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని, లేనట్లయితే జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు పోరాట కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు.మరి కొంతమంది ఉపాధ్యాయులు మ్యూచువల్ బదిలీలలో భాగంగా వారి ఇష్టంతో పీఏ పల్లి లాంటి మండలాలకు వచ్చి వారి పలుకుబడిని ఉపయోగించి పట్టణ ప్రాంతాలకు దగ్గర ప్రదేశాలకు డిప్యూటేషన్ లపై వెళుతున్నారు. వాస్తవంగా వెనుకబడిన మారముల మండలాలకు ఉపాధ్యాయులు అవసరం ఉంది. అక్కడ ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులు అధికంగా ఉన్నారని అన్నారు.

పిల్లల అవసరాలు చూడకుండా ఇలా అక్రమ డిప్యూటేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల అవసరాలకు కాకుండా ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కొరకు ఈ డిప్యూటేషన్లను ఉపయోగించుకుంటున్నారు. కావున ఇలా డిప్యూటేషన్ పై వెళ్లిన వారిని వెంటనే వెనుకకు పిలిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి. నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బి. అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, కోశాధికారి వడిత్య రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు, సిహెచ్. అరుణ, జిల్లా కార్యదర్శులు సిహెచ్. రామలింగయ్య, గేర నరసింహ, ఎం. శ్రీనివాసరెడ్డి, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమరాజు సైదులు, వై. యాదగిరి, చిన్న వెంకన్న, వేదశ్రీ, మురళయ్య, నరసింహమూర్తి, భాను ప్రకాష్, వరలక్ష్మి, ఎర్ర నాగుల సైదులు, రాగి రాకేష్, గిరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.