Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TTD: తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు కేఏ పాల్

TTD: ప్రజా దీవెన, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం (Srivari Laddu Prasad) తయారీలో ఉపయోగంచిన నెయ్యి లో జంతు కొవ్వు కలిసిందని నిర్ధా రణ కావడం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తునకు కూటమి ప్రభుత్వం సిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా షురూ కానుంది.

ఈ నేపథ్యంలో లడ్డూ వ్యవహారం లో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరు మల లడ్డు వివాదంపై (Srivari Laddu Prasad)ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul)ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.భక్తుల మనోభావా లు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయం టూ ఆయన కోర్టు దృష్టికి తీసు కెళ్లారు. అయితే కోర్టుకు ఇప్పటికి ప్పుడు సమయం లేదని ధర్మాసనం తెలిపింది. వచ్చే వారం రెగ్యులర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్‌కు హైకోర్ట్ (High Court) ధర్మాసనం సూచించింది.