Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tungabhadra Reservoir: ఊడిపడిన తుంగభద్ర గేటు

–నీట కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు
–జలాశయంకు గేట్ల ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదం
–డ్యామ్‌ చరిత్రలో భద్రతాపరంగా ఇదే తొలి సారి
–ఆందోళన అవసరం లేదంటున్న జలాశయ అధికారులు

Tungabhadra Reservoir: ప్రజా దీవెన, కర్నూలు కర్ణాటకలోని హోస్పేట్ లో (Hospet) గల తుంగభద్ర జలాశయం (Tungabhadra Reservoir) ఉన్న 33 లో గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకు పోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వా స్తవంగా తుంగభద్రజలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూ సివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్‌ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో గేట్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీరు వరద వృధాగా వెళ్తున్నాయి. ఎగువ వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను మేటెనెన్సు చేసే సమయం లో ఈ సంఘటన చోటు చేసుకుంద ని అధికారులు వెల్లడించారు. ప్రస్తు తం ప్రాజెక్టులో దాదాపు 100 టి ఎంసిలకు పైగా నీళ్లు ఉన్నాయి. ఇందులో 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఇంజనీర్లు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 33 గేట్లు తెరిచి దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదులుతున్నారు.డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి.ప్రస్తుతం తుంగ భద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది.

దీంతో నదీ పరివాహక (River basin)ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరి కలు జారీ చేశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా పరిధిలోని కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాలతో పాటు కర్నూలు నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తుంగభద్ర జలాశయం ఇంజనీర్లు సూచించారు.మొత్తం 48 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. దీంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రా లయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్ర దించండని ఏపీ విపత్తుల నిర్వహ ణ సంస్థ కీలక ప్రకటన చేసింది. కృ ష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది ఏపీ విప త్తుల నిర్వహణ సంస్థ.

వెనువెంటనే స్పందించిన చంద్రబాబు (chandra babu)… తుంగభద్ర డ్యాం గేట్ (Tungabhadra Dam Gate)కొట్టుకుపోవడం వల్ల అనంత పురం, కర్నూలు జిల్లాల రైతులకు ( For the farmers of Anantapur and Kurnool districts)తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే తుంగభద్ర డ్యాం గేట్ కొట్టు కు వెళ్లిన విషయాన్ని సీఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి పయ్యావుల. నీటిని నిలువగ్రింట చేందుకు తీసుకుంటున్న చర్యలపై కర్ణాటక ప్రభుత్వం, తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో పయ్యావుల సంప్రదిం పులు చేస్తున్నారు. ఈ సందర్బంగా మంత్రి పయ్యావుల మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపో వడం బాధాకరమన్నారు. తుంగభ ద్ర డ్యాంకు గేట్ (Tungabhadra Danku Gate) లాక్ సిస్టం లేకపోవ డం వల్ల ఇబ్బందులు వస్తున్నాయ ని, గేట్ కొట్టుకుపోతే నీటిని నిలు వరించే వ్యవస్థ తుంగభద్ర డ్యాంకు లేదని తెలిపారు.దీని వల్ల నీరు వృధాగా కిందకు పోతోందని, కొట్టు కుపోయిన గేట్ స్థానంలో ప్రత్యా మ్నాయ గేట్ ఏర్పాటుకు ఏపీ వైపు నుంచి సాయం అందిస్తామని ప్రక టించారు. రబ్బర్ డ్యాం ఏర్పాటు చేయాలా లేక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని చూస్తున్నామ న్నారు. డ్యాం అధికారులతో డ్యాం పై గతంలో పని చేసిన గన్న య్య నాయుడు లాంటి నిపుణులతో సంప్రదిస్తున్నామని, అనంత, కర్నూ లు జిల్లాల రైతులకు తుంగభద్ర అత్యంత ప్రధానమైన డ్యాం అన్నా రు. గేట్ కొట్టుకుపోవడం వల్ల మి రప పంట వేసిన రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని వెల్ల డించారు.

అధికారులతో బాబు సమీక్ష…
తుంగభద్ర డ్యాం గేటు (Tungabhadra Danku Gate)కొట్టుకుపో యిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు డు (Nimmala Ramanayu), ఇరిగేషన్ ఇంజనీర్లతో ప్రత్యే కంగా భేటీ అయ్యారు. తుంగభద్ర డ్యాం సంఘటన ప్రదేశానికి చంద్ర బాబు ఆదేశాలతో సెంట్రల్ డిజైన్ కమిషనర్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పంపించడం జరిగిందని ఇరిగే షన్ శాఖ మంత్రి రామా నాయుడు వెల్లడించారు.డ్యాం గేటు కొట్టు కుపోయినందున ప్రజలను అప్రమత్తం చేసేలా జిల్లా కలెక్టర్ తో పాటు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యం గా కౌతాలం, ,కోసిగి, మంత్రాల యం, నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ప్రజలను హెచ్చరించడంతోపాటు తుంగభద్ర నది తీర ప్రాంతాలలో దండోరా వేయి స్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల అధి కారులను అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించడం గమనా ర్హం.