Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJ: జర్నలిస్టుల జాతరను జయప్రదం చేద్దాం

–టియుడబ్ల్యూజె రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పాషా

TUWJ: ప్రజా దీవెన, వేములవాడ: తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం లో పురుడు పోసుకున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజ తోత్సవాల ను జయప్రదం చేద్దామని తెలంగా ణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (H143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజ న్న సిరిసిల్ల అధ్యక్షులు లాయక్ పా షా పిలుపునిచ్చారు. వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు.

తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భ వించి మే 31వ తేదీతో 25 వ వసం తంలోకి అడుగుపెడుతున్న సంద ర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహిస్తున్న సంబరాల సభ కు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తల్లి రావా లని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధ నలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను తెలియజేయడం కోసం మే 31న టీజేఎఫ్ రజతోత్సవాలను నిర్వ హిస్తుందని తెలిపారు.

తెలంగాణ కోసమే తెలంగాణ జర్న లిస్టులు నినాదం తో 2001 మే 31 న ఆవిర్భవించిన తెలంగాణ జర్నలి స్టుల ఫోరం తెలంగాణ రాష్ట్రం ఏ ర్పాటు 2014 వరకు అన్ని వర్గాల ప్రజలను,ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజేఎఫ్ అల్లం నారాయణ లతో పాటు యా వత్ తెలంగాణ జర్నలిస్టుల కృషి అని గుర్తు చేశారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబ రాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుం డి జిల్లా నుండి జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో తరలివచ్చి జర్నలిస్టుల జాతరను విజవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ప్రధాన కార్యదర్శి ఆయాచి తుల జితేందర్, ఉపాధ్యక్షులు స య్యద్ అలీ, జిల్లా రమేష్, దేవరా జ్, ప్రచార కార్యదర్శి షేక్ రియాజ్, కోడం గంగాధర్, హరీష్, విష్ణు, రా జేందర్, వెంకటేష్, ఇమ్రాన్, ఫహద్ పాషా, సల్మాన్, శ్యామ్, షోయబ్ లతోపాటు కార్యవర్గం సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.