–మంత్రివర్గం ఆమోదo, 23 లక్షల కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం
–వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమ లు చేసేందుకు సమాయత్తం
–చివరి 12 నెలల మూలవేతనం స గటులో పింఛన్గా 50 శాతం పొం దే అవకాశం
–పదేళ్ళ సర్వీసుకు కనీస పింఛను 10 వేలు, 25 ఏళ్ల సర్వీసుకు అంత మొత్తం
–రాష్ట్రాలు అమలు చేయాలని సూచన, అమలైతే 90 లక్షలకు లబ్ధిదారులు పెరిగే అవకాశం
–బయో ఈ–3 విధానానికి క్యాబి నెట్ పచ్చజెండా, విజ్ఞాన్ ధార పథ కానికి ఆమోదం
Central Cabinet: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత (యూని ఫైడ్) (Union Cabinet) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబి నెట్ ఆమోదించింది. దీని వల్ల పద వీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే ఏకీకృత పింఛన్ పథకం (యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది. రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేం ద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీం తో పాటు బయోఈ–3 విధానానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో మూడు వేర్వేరు పథకాలను కలిపి విజ్ఞాన్ ధార పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలను వెల్లడించారు. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరిం చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే లబ్ధి దారుల సంఖ్య 90 లక్షల వరకు ఉం టుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తా మన్నారు.
ప్రస్తుతం పింఛన్ విధా నాల (Pension method) బకాయిలు రూ.800 కోట్లుగా ఉన్నాయని, కొత్త పింఛన్ అమలు తో తొలి ఏడాది రూ.6,250 కోట్ల వరకు అదనంగాఅవసరం ఉంటుం దని, ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జాతీ య పింఛన్ పథకం (ఎన్పీఎ స్) నుంచి కొత్త పెన్షన్ స్కీమ్(యూ పీఎస్)కు మారేలా అవకాశం కల్పి స్తామని ఆయన వివరించారు. ఇం తకు ముందే ఈ విధానం అమలు కు కసరత్తును ప్రారంభించామని, ఉద్యోగులు పలు అంశాలపై ఆందో ళన వ్యక్తం చేస్తే ఆ మేరకు మా ర్పులు చేసి, అమల్లోకి తీసుకువ స్తున్నామని చెప్పారు. ఈ అంశంపై అన్ని రాష్ట్రాల్లో 100కి పైగా సమావే శాలు నిర్వహించి, అన్నివర్గాలతో చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వో ద్యోగుల శ్రేయస్సు, సురక్షితమైన భవిష్యత్ కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానం ఉద్యోగులకు గౌరవం, ఆర్థి క భద్రతను కల్పిస్తాయన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఏకీకృత పింఛన్ పథకం ఉద్యోగులకు పింఛన్ హామీ ని పెంచుతూ గ్రాట్యుటీ (Gratuity), ఇతర ప్ర యోజనాలకు భరోసా ఇస్తోందని, కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్ అయ్యేవారికి పదవీ విరమణకు ముందు 12 నెల లు తీసుకున్న బేసిక్ పే సగటులో 50 శాతం పింఛన్గా (pension) వస్తుందని, కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తిచేసు కుని, రిటైర్ అయ్యేవారికి అనులో మానుపాతంలో పింఛన్ వస్తుంది. ఇది 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకు న్న వారితో పోలిస్తే తక్కువగా ఉం టుందని, అంటే పింఛన్ హామీ కనీ సం రూ.10 వేలుగా ఉంటుంది. ఒక ఉద్యోగి మరణిస్తే పింఛన్లో 60% ఆయన, ఆమె కుటుంబ సభ్యులకు అందుతుంది. అఖిల భారత విని యోగదారుల ధరల సూచీ(ఏఐసీ పీఐ–డబ్ల్యూ) ప్రకారం పింఛన్/కుటుంబ పింఛన్దారులకు కరువు ఉపశమనం లభిస్తుంది. రిటైర్ అ య్యాక గ్రాట్యుటీతోపాటు సత్వరం అదనపు లబ్ధి ఉంటుంది. దీన్ని సర్వీసులో ప్రతి ఆర్నెల్ల ప్రాతి పదిక న లెక్కగడతారు. అంటే సర్వీసులో ఉండగా ప్రతి ఆర్నెల్లకు ఒక నెల జీతంతో కలిపి కరువు భత్యంలో పదో వంతు చొప్పున లెక్క కట్టి రిటై ర్ అయిన వెంటనే ఆ మొత్తం ఇస్తా రు. ఇది గ్రాట్యుటీకి అదనం కావ డం గమనార్హం.
బయోఈ–3 విధానంతో ప్రగతి …బయో ఉత్పాదక రంగా న్ని ప్రోత్సహించేలా బయోఈ–3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమి, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్) విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమో దం తెలిపింది. బయోరంగంలో పరి శోధనలు, అభివృద్ధి, వ్యవస్థాపత కు ఈ విధానం దోహదపడుతుం దని అశ్వినీవైష్ణవ్ వివరించారు. పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాది రిగా త్వరలో బయో విప్లవం రాబో తోందని ఆయన అభిప్రాయపడ్డా రు. దీనివల్ల బయోటెక్నాలజీ, బయోసైన్స్ రంగాల్లో భారీగా ఉపా ధి అవకాశాలున్నాయన్నారు. బ యో కృత్రిమ మేధ(ఏఐ) హబ్లు, బయో ఉత్పాదక కేంద్రాలు, బయో ఫౌండ్రీల ఏర్పాటుకు ఈ విధానం దోహదపడుతూ బయో రంగం వాణిజ్యీకరణకు వేగంగా అడుగు లు పడతాయన్నారు.
గ్రీన్ గ్రోత్ (Green growth) ద్వారా బయో ఎకానమి నమూనా లకు ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విధానంతో భారతదేశ నైపుణ్య శ్రామికశక్తి విస్తరణను సులభతరం చేయడమే కాకుండా ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుందని వివ రించారు. నెట్ జీరో కార్బన్ ఎకా నమి, లైఫ్స్ట్టైల్ ఫర్ ఎన్విరాన్మెం ట్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ఈ విధానం మరింత బలోపేతం చేస్తుంది. బయోఈ–3 విధానం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ మరింత స్థిరమైన, వినూత్నమైన భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. వికసిత్ భారత్ కోసం బయో–విజన్ను నిర్దేశిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆహార భద్రత, మానవ ఆరోగ్యానికి సంబంధించిన క్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారం గా ఈ విధానం ఉంటుంది. పారిశ్రా మికీకరణలో పెట్టుబడులకు ఉపక రిస్తుందని అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యా నించారు. విజ్ఞాన్ ధార పథకం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధ నాభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకే తికాభివృద్ధి వంటి పథకాలను (మూడు గొడుగుల పథకాలు) ‘విజ్ఞాన్ ధార’ పేరుతో ఏకీకృత పథకంగా అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సంబంధిత విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం వల్ల, సమ ర్థంగా నిధుల వినియోగం, ఉప పథకాలు, కార్యక్రమాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు పథ కాలకు 15 ఆర్థిక సంఘం (2021– 22 నుంచి 2025–26 వరకు) రూ.10,579 కోట్లను ఖర్చు చేయా లని నిర్దేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.