–ఒప్పందాన్ని ఏకపక్షంగా తాము ర ద్దు చేయలేదు
–పాకిస్థాన్ పదేపదే రెచ్చగొట్టే చర్య లతోనే చట్టపరంగా సస్పెండ్ చేశాం
— కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టీకరణ
Union Home Minister Amit Shah: ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: పహల్గాం ఉ గ్రదాడి అనంతరం పాకిస్థాన్పై కఠిన చర్యల్లో భాగంగా సింధూ జలాల ఒ ప్పందాన్ని భారత్ తాత్కాలికంగా ని లిపివేయడం ద్వారా దాయాది దేశా నికి ముకుతాడు వేసిన విషయం తె లిసిందే. ఈ ఒప్పందాన్ని పునరుద్ధ రించే అవకాశం ఉందా దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్షా శనివారం ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చా రు.
పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పం దాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా తాము ర ద్దు చేయలేదని, పాకిస్థాన్ పదేపదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుం డటంతో చట్టపరంగా ఒప్పందాన్ని సస్పెండ్ చేశామని చెప్పారు.లేదు, ఎప్పటికీ ఒప్పందాన్ని పునరుద్ధరిం చం. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయకూడదు. అ యితే తాత్కాలికంగా నిలిపివేసే హక్కు మాకు ఉందని అమిత్షా తెలిపారు. 1960 ఒప్పందంలోని ప్రియాంబుల్ను ప్రస్తావిస్తూ, ఇండి యా-పాకిస్థాన్ మధ్య శాంతి, ప్రగ తికి ఉద్దేశించినట్టు అందులో చెప్ప డం జరిగిందని అన్నారు. అయితే దానిని ఉల్లంఘించడం అంటూ జరి గితే ఒప్పందానికి అర్ధ మే లేకుండా పోతుందని అన్నారు.
తమకు హక్కుభుక్తమైన జలాలను తాము సక్రమంగా వినియోగించు కుంటా మని, కెనాల్ నిర్మాణం ద్వా రా నీటిని రాజస్థాన్కు మళ్లిస్తామని చెప్పారు. ఏప్రిల్ 21న జరిగిన పహ ల్గాం ఉగ్రదాడిపై మాట్లాడుతూ, క శ్మీర్లో శాంతి, పర్యాటకాన్ని దెబ్బ తీసి, కశ్మీర్ యువకులను తప్పదా రి పట్టించేందుకు ఉద్దేశపూ ర్వకం గానే ఈ దాడి జరిగిందని చెప్పారు. కశ్మీర్తో పాటు యావద్దేశం ఈ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా సంఘీభావం తెలిపిందన్నారు. పాకిస్థాన్ ఎంచు కున్న మార్గాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా తిప్పికొట్టామని చెప్పా రు. జనావాసాలను లక్ష్యంగా చేసు కుని పాకిస్థాన్ దాడులు జరపడం తో పాక్ ఎయిర్బేస్లను ఇండియా ధ్వంసం చేసిందని, కాల్పుల విర మణకు పాక్ కోరడంతో అందుకు అం గీకరించామని చెప్పారు.
పహల్గాం దాడికి ప్రతిగా ఉగ్రవాద స్థావరాలకు మాత్రమే దాడులను పరమితం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థిరనిశ్చయంతో ఉ న్నారని అమిత్షా చెప్పారు. ‘కేవ లం లక్షిత దాడులకే మేము పరిమి తం అవుతున్నామని చాలా స్పష్టం గా చెప్పాం. అయితే టెర్రరిస్టులపై మనం చేసిన దాడులను తమ భూభాగంపై జరిపిన దాడులు గానే పాకిస్థాన్ భావిస్తూ వచ్చింది’ అని ఆయన వివరించారు.
కాంగ్రెస్కు ఆ హక్కు లేదు
ఆపరేషన్ సిందూర్తో సహా భారతదేశం తీసుకున్న మిలటరీ చర్యలపై కాంగ్రెస్ చేసిన విమర్శలను అమిత్షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ తమ హయాంలో ఏమి చేసింది? మంత్రిని మార్చడం మినహా వాళ్లు చేసిందేమీ లేదు. ఉగ్రవాదంపై కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీకీ తమను విమర్శించే హక్కులేదని అమిత్షా స్పష్టం చేశారు.