Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Union Railway Minister Ashwini Vaishnav: మంత్రుల అప్పీల్, కాజీపేట,కొత్త రైల్వే లైన్ల మంజూరీ చేయండి.

Union Railway Minister Ashwini Vaishnav: ప్రజా దీవెన హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య తదితరులు కలిశారు. కాజీపేట డివిజన్ వరం గల్ అభివృద్ధికి బాసటగా ఉంటుం దని ఈ సందర్భంగా మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రతినిధుల బృందం వివరిం చింది. పెండింగ్ రైల్వే లైన్లను పూర్తి చేయడంతో పాటు పూర్తి రైల్వే ని ధులతో కొత్త లైన్లు మంజూరీ చే యాలని అప్పీల్ చేశారు.

ROB, RUB లను నిర్మించి రైల్వే క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలకు చెక్ పెట్టాలని మంత్రులు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.మంత్రుల అభ్యర్ధనలను పరిశీ లించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అనుకూలం గా స్పందించారు.కేంద్రమంత్రి సాను కూల స్పందనపై మంత్రులు, ఎంపీ లు సంతోషంవ్యక్తం చేశారు. సంద ర్భంగా ప్రత్యేకించి తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల మంజూరుతో పాటు కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు పై శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి విన్నవించారు.

అనంతరం మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లా డుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని మంత్రులు, ఎంపీల బృందం కలిసి నట్లు వివరించారు.రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయడం తో పాటు వాటిని పూర్తిగా రైల్వే నిధులతో నిర్మించేలా సహకరించా లని, కాజీపేటలో కొత్త రైల్వే డివి జన్ ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పను లను వేగవంతం చేసి ప్రారంభిం చేలా చూడగలని కోరినట్లు తెలిపా రు. రాష్ట్రంలో ముఖ్యమైన కాజీపే ట రైల్వే డివిజన్ తెలంగాణ రెండో అతిపెద్ద నగరం వరంగల్ అభివృ ద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని, ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం విశాఖప ట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేసింది. దీంతో దక్షిణ మ ధ్య రైల్వే క్రింద సికింద్రాబాద్, హైద రాబాద్, నాందేడ్ వంటి 3 జోన్లు మాత్రమే ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసు కెళ్లినట్లు ఆయన తెలిపారు.

ప్రయా ణికులకు,గూడ్స్ కి సమర్ధవంత మైన రైల్వే నెట్ వర్క్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ను చేసేందుకు కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, అత్యధిక ప్రయాణీకుల ట్రాఫిక్‌తో పాటు, సరుకు రవాణా చేస్తున్న కాజీపేట ను డివిజన్‌గా చేస్తే గుంటూరు మరియు హైదరా బాద్ డివిజన్‌ల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుందని లేఖలో వివరించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు నిర్మాణం చుట్టు రింగ్ రైల్ ను నిర్మిస్తామని స్వయంగా వారే సాను కూలత వ్యక్తం చేయడం పట్ల మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

అదేవిధంగా వికా రాబాద్-కృష్ణ లైన్ దక్షిణ తెలంగా ణలో వెనకబడిన పరిగి, కొడంగల్, టేకల్ కోడే, నారాయణ్‌పేట మరి యు మక్తల్ వంటి పట్టణాలను క లుపుతుందని, తాండూరు పట్టణం చుట్టూ ఉన్న సిమెంట్ పరిశ్రమల తో పాటు భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలకు కూడా అత్యంత ఉప యోగకరంగా ఉంటుందని, ఆర్ధికం గా ఇబ్బంది లేని ఈ రైల్వే లైన్ ను నిర్మిస్తే సరుకు రవాణా మార్గంగా ఉపయోగకరంగా ఉండబోతున్నం దున దీన్ని ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో పరిగ ణంలోకి తీసుకొని నిర్మిస్తే రైల్వే శాఖకు మరియు తెలంగాణ ప్రజ లకు అనేక ప్రయోజనాలను కలిగి స్తుందని లేఖలో వివరించినట్లు తెలిపారు.

గద్వాల్ – డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేపై స్థానికుల అభిప్రాయాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెం దిన చిన్న, సన్నకారు రైతులు నివ సించే కూసుమంచి మీదుగా వెళ్తు న్న ఈ గద్వాల్ – డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే పై ఖ మ్మం పార్లమెంటరీ నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఆందోళన చెందు తున్నారని, ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ అత్యధిక జనాభా కలిగిన స్తం భాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథా రిటీ (SUDA) క్రింద నోటిఫై చేయబ డిన పట్టణ ప్రాంతం నుంచి వెళ్తుం దని, ఇదే రైల్వే లైన్ ప్రాంతంలో భారతదేశంలోని అతిపెద్ద బుద్ధ స్థూపం, సైబీరియన్ పక్షులు వలస వచ్చే ఆవాస ప్రాంతాలు మరియు పాలేరు రిజర్వాయర్ ను పునురు ద్ధరిస్తున్న ప్రాంతంకూడా ఉందని, ఇక్కడ భూసేకరణకు ఎకరాకు రూ. 1 కోటి నుంచి 4 కోట్ల వరకు రైతుల కు చెల్లించాల్సిన రావడం ప్రాజె క్టుకు ఆర్ధిక భారంగా మారుతుంద నే విషయాన్ని వారికి వివరించామ న్నారు.

ఈ రైల్వే లైన్ ను వయా కూసుమంచి నుంచి కాకుండా ప్రత్యామ్నయ మార్గం డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు వయా వె న్నారం, మన్నెగూడెం, అభిపాలెం, మరిపెడ మరియు మోతే ద్వారా వెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెమి అర్భన్ బెల్ట్ ను ఏర్పాటు చేయడానికి హైదరా బాద్ నగరం చుట్టూ 370 కి.మీ పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణాన్ని చేపడుతోం దన, ఈ రీజినల్ రింగ్ రోడ్డు చుట్టు రీజినల్ రింగ్ రైల్ ను నిర్మిస్తే రా ష్ట్రంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య సామాజిక అను సంధానం, ఆర్థిక తోడ్పాటును కలిగిస్తుందని చెప్పామన్నారు. భారీ ఉపాధి అవకాశాలను కల్పిం చే ఈ ప్రాజెక్ట్ వలన గ్రామీణ పేదరి కం తగ్గుతుందని, పారిశ్రామిక వృద్ధి కి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని గుర్తు చేసినట్లు ఆయ న తెలిపారు.

అదే సందర్భంలో కల్వకుర్తి నుండి మాచర్ల – 120 కి.మీ, డోర్నకల్ నుండి మిర్యాల గూడ – 97 కి.మీ , మెదక్ వద్ద ని ర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ డ్రైపోర్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని బందర్ పోర్టు వరకు – 461 కి.మీ, పాండు రంగాపురం నుంచి భద్రాచలం – 16 కి.మీ వంటి కొత్త రైల్వే లైన్లకు మం జూరీలు ఇచ్చి రైల్వే నిధులతో నిర్మించాలని కోరారు. ఈ కొత్త రైల్వే లైన్లు మంజూరు వల్ల రాష్ట్రం లోని వెనుకబడిన మరియు మారు మూల ప్రాంతాలలో నివసించే ప్రజ ల సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరి యు పరిశ్రమలకు ఉపయోగక రంగా ఉంటుందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు వివరిం చారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో….

ఉమ్మడి నల్గొండ, జిల్లాలో పలు రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వల్ల ప్రమా దాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఆధ్వర్యంలో పూర్తి రైల్వే నిధులతో ఆర్ఓబిలను మంజూరు చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వి ని వైష్ణవ్ ను కలిసి అభ్యర్థన లేఖ ను అందించారు. రైళ్ల రాకపోకల సమయంలో గేట్లు మూసివేయడం వల్ల ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటు, ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు పోతున్నాయని విషయా న్ని వివరించినట్లు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఇబ్బందులను అధిగమించేందు కు ఇప్పటికే ఉన్న లెవెల్ క్రాసింగ్‌ల స్థా నంలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (RO Bలు) నిర్మించాలని రైల్వే శాఖ మం త్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్న వించామన్నారు.

1. నల్గొండ జిల్లాలో రాయనగూడెం – తిప్పర్తి సెక్షన్ లో.. ముకుందాపురం, తిప్పర్తి లోని కి.మీ 1/0-4, రైల్వే కి.మీ 92/11-12 వద్ద LC నం. 56.

2. నల్గొండ జిల్లాలో నల్గొండ రాయనగూడెం విభాగంలోని పెద్దబండ నుండి NAM రోడ్డు వయా FCI గోడౌన్ల లోని కి.మీ 0/2-6, కి.మీ 77/16-17 వద్ద LC నం. 45.

3. నల్గొండ జిల్లాలో.. పగిడిపల్లి – నడికుడే సెక్షన్ లోని నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులోని కి.మీ 1/0-2 వద్ద రైల్వే కి.మీ 56/4-5 వద్ద LC నం. 32.

4. నల్గొండ జిల్లాలో సికింద్రాబాద్ నుండి కాజీపేట సెక్షన్ లోని రైల్వే కి.మీ 133/5-6 వద్ద దామెర్ల – వీర్లపాలెం రోడ్డులోని రోడ్డు కి.మీ 0/4-6 వద్ద LC నం. 86.

5. త్రిపురారం – కుక్కడం రోడ్డులోని రోడ్డు కి.మీ 10/4-6 వద్ద పగిడిపల్లి నుండి నడికుడి విభాగంలోని రైల్వే కి.మీ 105/10-11 వద్ద LC నం. 64 (వయా పెద్దదేవులపల్లి).

6. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ నగరం రోడ్డులో 16/8 వద్ద BB నగర్ గుంటూరు విభాగంలోని LC నం. 16.

7. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సికింద్రాబాద్ కాజీపేట విభాగంలోని LC నం. 30, పగిడిపల్లి భువనగిరి రోడ్డులోని రోడ్డు కి.మీ 7/550 వద్ద.

8. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సికింద్రాబాద్ – కాజీపేట విభాగంలోని LC నం. 31, ముత్తిరెడ్డిగూడెంలోని భువనగిరి – రాయగిరి రోడ్డులోని రోడ్డు కి.మీ 0/0-2 వద్ద.

9. జనగాం జిల్లాలోని పెంబర్తిలో సికింద్రాబాద్ – కాజీపేట సెక్షన్ లో LC నం. 40 వద్ద.. పెంబర్తి- కొన్నే రోడ్డులోని రోడ్డు కి.మీ 0/8-10 వద్ద.

10. యాదాద్రి భువనగిరి జిల్లాలో సికింద్రాబాద్ – కాజీపేట సెక్షన్ లోని LC నం. 38 వద్ద పాత Hyd హనుమకొండ రోడ్డులోని అలేరి – పెంబర్తి రోడ్డులోని రోడ్డు కి.మీ 71/2-4 వద్ద .

11. యాదాద్రి భువనగిరి జిల్లాలో బిబినగర్ – గుంటూరు సెక్షన్ లోని చౌటుప్పల్ నుండి నగరం వరకు వలిగొండ – రామన్నపేట రోడ్డులోని రోడ్డు కి.మీ 16/8 నుండి 17/0 వద్ద LC నం. 16.

12. నల్గొండ జిల్లాలో రామన్నపేట – చిట్యాల సెక్షన్ లోని, కి.మీ 0/4-6 వద్ద చిట్యాల మునిసిపాలిటీ & కాటన్ రైస్ ఇండస్ట్రీస్‌ రోడ్ లో చిట్యాల మండలం హెడ్ క్వార్టర్స్- మునుగోడు మండలం హెడ్ క్వార్టర్స్ లో LC నం. 26 వద్ద.

13. నల్గొండ జిల్లాలో రామన్నపేట – చిట్యాల సెక్షన్ లోని.. నార్కట్‌పల్లి – మునుగోడు రోడ్డులోని కి.మీ 1/0-2 వద్ద పగిడిపల్లి – నడికుడే విభాగంలోని రోడ్డు కి.మీ 56/4-5 LC నం. 32 వద్ద.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రులు, ఎంపీ లంతా కలిసి ఇచ్చిన రైల్వే నూతన లైన్లు, కాజీపేట కొత్త డివిజన్ ఏ ర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వేగవంతం చేయడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి మీడియాకు తెలిపారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టులన్ని పట్టాలెక్కుతాయనే ఆశాభావంతో ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు లేవని, బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులంతా రా ష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కలిసి రావాలని ఆయ న విజ్ఞప్తి చేశారు. పది సంవత్సరా ల్లో ఒక్క అడుగుపడని మామునూ ర్ ఎయిర్ పోర్టు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన యేడాది కాలంలోనే ఎలా సాధ్యం అయ్యిందని ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ప్రజాప్రభుత్వం రాష్ట్రాన్ని అభి వృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ముం దుకు వెళ్తుందని ఆయన తెలి పారు.