–గోదావరి, బనకచర్లపై తదుపరి చ ర్యల ప్రణాళికకు సన్నద్ధం
–బనకచర్ల పై రేపు సచివాలయం లో ఉన్నతస్థాయి సమావేశం
–ముఖ్య అతిధులుగా ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం
–ప్రత్యేక అతిధులుగా కేంద్ర మం త్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు స్వయంగా మంత్రి ఉత్తమ్ ఆ హ్వానం
–అందుబాటులోని లోకసభ, రా జ్యసభ సభ్యులతో ఫోన్ లో మంత్రి ఉత్తమ్ సమన్వయం
Uttam Kumar reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: గోదావరి బనకచర్ల ప్రాజెక్టును మరింత గట్టి గా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వ కుండా ఒత్తిడిచేసేందుకు రాష్ట్ర ప్ర భుత్వం కార్యాచరణ పథకాన్ని రూ పొందిస్తోందని రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాల శాఖా మంత్రి కె ప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పే ర్కొన్నారు.అందులో భాగంగ బుధ వారం సాయంత్రం 4 గంటలకు రా ష్ట్ర సచివాలయంలో లోకసభ, రా జ్యసభ సభ్యులతో ప్రత్యేక స మా వేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వి వరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పా ల్గొనను న్న ఈ సమావేశంలో ప్రత్యేక అతి ధులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను అహ్హ నించిన ట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి స మావేశానికి అహ్హనించారు. అందు బాటులో ఉన్న లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఫోన్ లో మా ట్లాడి సమావేశంలో పాల్గొనాలని ఆ యన కోరారు. ఈ మేరకు నేడిక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్ర కటన విడుదల చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాష్ట్ర ము ఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,తాను 20 25 జూన్ 3 న కొత్త ఢిల్లీలో కేంద్ర జలశక్తి మం త్రి సి.ఆర్ పాటిల్ ను స్వయంగా క లసి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం త రపున అభ్యంతరాలను లేవనెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అందుకు ప్రతిగా స్పందించిన కేం ద్రమంత్రి సి.ఆర్ పాటిల్ స్పందిస్తూ 2025 మే 28న తనకు రాసిన లేఖ లో గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజె క్టుకు సంబంధించిన డి. పి.ఆర్ కేం ద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అం దలేదని చెబుతూనే అది అందిన మీదట నీటి కేటాయింపులలో ప్ర స్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రి బ్యునల్ తీర్పులు, అంతర్ రాష్ట్ర ఒప్పందాలతో పాటు 2014 ఆంద్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్నకే సమీక్షి స్తామన్నారు.
తిరిగి 2025 జూన్ 13 న తిరిగి తా ను కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లే ఖలో గోదావరి-బనకచర్ల లింక్ పథ కంపై అభ్యంతరాలను తెలియ పర చడం జరిగిందన్నారు.అంతే గాకుం డా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అ నుమతులను కేంద్ర జల సంఘం నిలువరించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన ఉటంకించారు.
వీటన్నింటినీ సమీక్షించిన మీదట గోదావరి-బనకచర్ల విషయంలో భ విష్యత్ లో అనుసరించాల్సిన వ్యూ హంపై బుధవారం రోజున డా క్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాల యంలో లోకసభ, రాజ్యసభ సభ్యు లతో సమావేశం ఏర్పటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపా రు.సాయంత్రం 4 గంటలకు జరగ నున్న ఈ సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతి ధి గా పాల్గొంటారని ఆయన పేర్కొ న్నారు.