Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Uttam Kumar Reddy: ధాన్యం దిగుబడిలో తెలంగాణ రి కార్డ్, 127.50 లక్షల మెట్రిక్ టన్ను ల దిగుబడి అంచనా

–కొనుగోలు ఏర్పాట్లను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి
–వానాకాలం, యాసంగి కలిపి 2 81 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
— పౌరసరఫరాల శాఖ మంత్రి మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో యాసంగి సీజన్ లో రికార్డ్ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అ వుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నా రు. రబీ సీజన్ లో ఉత్పత్తి అయిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. శని వారం మద్యాహ్నం ఎర్రమంజిల్ కా లనీ లోని పౌర సరఫరాల శాఖా కేం ద్ర కార్యాలయంనుండి మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి ఎస్ చౌ హన్,వినియోగదారుల వ్యవహా రా లు,ఆహార,పౌర సరఫరాల శాఖా జాయింట్ కమిషనర్ ప్రియాంకా ఏలే, డైరెక్టర్ ప్రసాద్ తదితరులతో కలసి జిల్లా కలెక్టర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదిలా బాద్ నుండి రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి దలసరి అనసూయ సీతక్క పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అంశం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకుందని ఆయా జిల్లాల కలె క్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్ లో రైతాంగం సాగు చేసిన 57 లక్షల ఎకరాలలో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవు తుందని అంచనా వేస్తున్నామన్నా రు. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభు త్వం ఏర్పాట్లు చేసుకుందని ఆయ న వెల్లడించారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్ లు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగు బడి అవుతుందని ఇది తెలంగాణా లో మాత్రమె కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు యావత్ భారతదేశంలోనే అరుదైన రికార్డ్ నమోదు చేసుకుందన్నారు.

ఖరీఫ్ సీజన్ లో 66.7 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాగా ప్రస్తుత రబీ సీజన్ లో 57 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగు బడి అంచనా వేస్తున్నామన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనలో ఎ టువంటి లోటు పాట్లు లేకుండా ఆ యా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పు డు సమీక్షించాలని ఆయన సూచిం చారు.

ఖరీఫ్ సీజన్ లో రికార్డ్ స్థాయిలో పండిన పంటను కొనుగోలు చేసేం దుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు,మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు సమర్థవం తంగా వ్యహరించారని ఆయన ప్రశంసించారు. ధాన్యం కొనుగోళ్లు సున్నిత మైన అంశమని అధికారు లు అప్రమత్తంగా ఉంటూ మారు తున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్య పరచాలన్నారు. ఏప్రిల్ రెండో వా రం పూర్తి అయ్యేనాటికి 8.51 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొను గోలు కేంద్రాలకు చేరగా ఇప్పటికే 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇందులో సన్నరకాలు 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండగా 1.98 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలనీ ఆయన వివరించారు. స న్నాలు పండించిన రైతాంగానికి బో నస్ లు ఎప్పటికప్పుడు వారి వారి ఖాతాలలో జమ చేస్తున్నామన్నా రు.ఇప్పటికి ధాన్యం కొనుగోలు కేం ద్రాల వద్ద 2.74 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం చేరిoదన్నారు. ధా న్యం కొనుగోలుకు గాను రాష్ట్ర వ్యా ప్తంగా ప్రభుత్వం 8,329 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి నిర్ణ యం తీసుకోగా ఇప్పటికే 7,337 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించా మన్నారు. సుమారు 88 శాతానికి పై బడి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఇవి పి.ఏ.సి. ఎస్, ఐ. కే. పి గ్రూపుల ఆధ్వర్యంలో న డుస్తున్నాయన్నారు

నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో పూర్తి స్థాయిలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారం బించగా మిగిలిన జిల్లాలో వరికో తలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభి స్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయా దాన్యం కొనుగోలు కేంద్రాలకు గ్రేయి న్ కాలిపర్స్, ఎలక్ట్రానిక్ తూకపు మిషన్లు, మాయిశ్చర్ మీటర్లతో పాటు టార్బాలిన్లు,క్లినర్లు,హస్క్ రిమువర్ వంటి యంత్రాలను తర లించినట్లు ఆయన వెల్లడించారు.
మొత్తం 17.5 కోట్ల గన్ని బ్యాగులు అవసరం ఉండగా 9.45 కోట్లు కొత్త వి,8.05 కోట్లు పాతవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 9.23 కోట్ల గన్ని బ్యాగులు అందుబాటు లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యా న్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తం గా 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాము లు ఉండగా అందులో 25 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ చేసేందుకు అవకాశం ఉందని మిగిలిన ధాన్యా న్ని నిలువ చేసేందుకు గాను వ్యవ సాయ మార్కెట్ కమిటీ,రాష్ట్ర గి డ్డంగుల సంస్థకు చెందిన గోదా ములతో పాటు ప్రవైట్ గోదాము లలో ధాన్యాన్ని నిలువ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలి పారు

తెలంగాణా రాష్ట్రంలో ముందెన్న డూ లేని రీతిలో సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడంతో లబ్దిపొందేందుకు సరిహద్దు రాష్ట్ర ల నుండి అక్రమంగా తరలించే అ వకాశాలు ఉన్నాయని,ఆ ప్రయ త్నాలను నిర్ద్వంద్వంగా అడ్డుకుం టామని తెలంగాణ ప్రభుత్వం అం దించే బోనస్ తెలంగాణా రైతాంగా నికే చేరాలని ఆయన స్పష్టం చేశా రు. అదే సమయంలో అనధికార రవాణా వ్యవస్థను అడ్డుకునేం దు కు సరిహద్దు చెక్ పోస్టులాలి సి.సి కెమెరాలతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.

దాన్యం కొనుగోలులో బ్యాంక్ గ్యా రెంటీ లతో పాటు ప్రభుత్వం నుండీ ఒప్పందం కలిగిన మిల్లర్లను మాత్ర మే అనుమతించడం జరుగుతుం దన్నారు. అదే విదంగా సన్నాలను గుర్తించేందుకు వీలుగా కేర్నల్ మె ట్రిక్,మైక్రో మీటర్లలతో ఫీల్డ్ ఆఫీ సర్లకు శిక్షణ ఇచ్చామన్నారు
ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అ త్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్న సన్న బియ్యం పంపిణీలో 25 శాతం నూకలు ఉం డడం భారత ఆహార సంస్థ నిబంధ నలలో భాగమే నన్నారు.ఈ విష యంలో విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు

ఫిలిప్పీన్స్ తో కుదుర్చుకున్న ఒ ప్పందం ప్రకారం ఇప్పటికే లక్ష మె ట్రిక్ టన్నుల దాన్యం ఎగుమతి చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మొదటి దశలో 12,500 మెట్రిక్ టన్నులు పంపించాగా రెం డో దశలో పంపిణీకి రంగం సిద్ధమైం దన్నారు.