Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Venkateswara Rao : ప్రజా పోరాట విప్లవ యోధురాలు మల్లు స్వరాజ్యం యువతకు ఆదర్శం వెంకటేశ్వరరావు

Venkateswara Rao : ప్రజా దీవేన,కోదాడ:వెట్టిచాకిరీ రద్దు చేయాలని,దున్నేవానికి భూమి కావాలని,నైజాం నవాబు గద్దె దిగాలనే నినాదాలతో సాగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం,లో ముందుండి పోరాడిన యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అని సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరావు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు అన్నారు.


బుధవారం పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మూడో వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలోని ఓ భూస్వామ్య కుటుంబంలో 1931లో మల్లు స్వరాజ్యంజన్మించారు.చిన్నతనంలో కమ్యూనిస్టు భావాలు అలవర్చుకొని దోపిడీకి వ్యతిరేకంగా,తన సొంత గ్రామంలో గ్రామ పటేళ్ళను,పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సంఘం పెట్టి కూలిరేట్ల ఉద్యమంతో ప్రారంభమైన ఆమె విప్లవ జీవితం ఎనిమిది దశాబ్దాల పాటు ఎన్నడూ వెనుదిరగ లేదు.విప్లవమే జీవితంగా భావించారు.ఎన్ని కష్ట నష్టాలొచ్చినా,పోరాటాలకు తట్టుకోలేక భూస్వాములు ఆమె సొంత ఇంటిని ధ్వంసం చేసినా, స్వరాజ్యంను పట్టుకుంటే బహుమతులిస్తామని నాటి సర్కార్‌ ప్రకటించినా మొక్కవోని ధైర్యంతో తన అన్న భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి (బి.యన్‌.) అడుగు జాడల్లో నడిచిన పోరాట యోధురాలు స్వరాజ్యం. అని కొనియాడారుకమ్యూనిస్టుల నాయకత్వను సాగిన సాయుత రైతాంగ పోరాటం అనే విజయాలు సాధించింది ఫలితంగా దేశవ్యాప్తంగా భూసంస్కరణ చట్టం కౌల్దారి చట్టాలు రూపొందాయి పౌరుహక్కులు ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయి. ఈ చారిత్రక పోరాటంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం పాత్ర అభ్యుదయం అజరామరం ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శం అని వారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్. గొర్రె ముచ్చు మరియన్న. గంట నాగరాజు. ఏడుకొండలు ఏసోబు శరభంద రెడ్డి వెంకన్న వీరభద్ర ఉపేందర్ సైదులు వెంకటేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.