Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Viral Video: అయ్యో పాపం దారుణం, బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు

ప్రజా దీవెన అగ్రా: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉసూరుమనే దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారి ఆక్రందనలు అరణ్య రోదన గా మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలో రహదారిపై ఓ బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు వైనం చూస్తే ఒళ్ళు జలదరించే దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు అయ్యో పాపం అని వైరల్ అవుతోన్న ఆ దృశ్యాలు నెట్టింట్లో చూస్తున్నం తసేపు బిక్కు బిక్కుమంటూ గడి పారు.

వేగంగా ముందుకు కదులు తున్న లారీ ముందు కింది భాగంలో బైక్‌తో సహా ఇరుకున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కదిలించాయి. పరిస్థితిని గమనించిన వాహనదారులు ఆపా లని ఎంత అరిచినా ట్రక్కు డ్రైవర్ ఆపకుండా ఆదమరిచి ముందుకు సాగాడు. దీంతో చివరికి ట్రక్కును ఆపి డ్రైవర్‌ను స్థానికులు చితక బాదారు. లారీ ముందు భాగాన్ని గట్టిగా పట్టుకోవడంతో చక్రాల కింద పడకుండా ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించ డo తో దేవుని దయతో ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ ఇద్దరి ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం నిలక డగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆలస్యం గా వెలుగులోకి రావడం కొసమె రుపు.