Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Development : ఆదర్శవంతంగా తెలంగాణను అభివృద్ధిపరుస్తాం

–అమర వీరుల స్ఫూర్తితో రాష్ట్రా భివృద్ధి
–25,35,964 లక్షల మందికి 20, 617 కోట్ల రుణమాఫీ
–భూభారతి చట్టంతో భూరికార్డుల ఆధునీకరణ
–మహిళల ఆర్థిక స్వావలంబనకు మహాలక్ష్మి పధకం
–సన్న బియ్యం పధకం చరిత్రాత్మక
–30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం
— నీటిపారుదల శాఖమంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Telangana Development : ప్రజా దీవెన, సూర్యాపేట: తెలం గాణా రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ సంక ల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశా రు.అమరవీరుల త్యాగాల స్పూ ర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింప చేసేందుకు బృహత్తర ప్రణాళికలు రూపొందించుకున్నా మని ఆయన వెల్లడించారు. తెలం గాణా రైజింగ్-2047 పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందిందని ఆయ న పేర్కొన్నారు.తెలంగాణా రాష్ట్ర 12 వ ఆవిర్భావ వేడుకలను ఆ యన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సము దాయంలో సోమవారం ఉదయం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం రూపొందించిన తెలంగాణా రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విశిష్టతను ఆయన వివరించారు.సంక్షేమం, సామజిక న్యాయం,గ్రీన్ ఎనర్జీ,ఇన్నోవేషన్, ఇండస్ట్రీ,టూరిజం ల అభివృద్ధికీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచే స్తుందన్నారు

తెలంగాణా రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామి గా నిలబెట్టడమే విజన్ డాక్యుమెం ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు ఎన్ని క ల్లో ఇచ్చిన హామీ మేరకు గడిచిన 18 నెలలుగా 25 లక్షల 35 వేల 96 4 మందికి 20,617 కోట్ల రుణమాఫీ అమలు పరచామన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదట సాగు అయిన వానా కాలం,యా సంగి పంటల దిగుబడి యావత్ భారతదేశంలొనే రాష్ట్రాన్ని అగ్ర గామిగా నిలబెట్టిందన్నారు.

పండిన పంటను ప్రభుత్వం మద్ద తు ధర చెల్లించి కొనుగోలు చేయడ మే కాకుండా,కొనుగోలు చేసిన దా న్యానికి 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసి నట్లు ఆయన వివరించారు. అంత టితో ఆగకుండా వ్యవసాయ చరిత్ర లోనే ముందెన్నడూ లేని రీతిలో స న్నాల ప్రోత్సాహనికీ గాను ఒక్కో క్వింటా ఒక్కింటికీ 500 రూపాయ లు బోనస్ చెల్లించామన్నారు.

రైతుపక్షపాతిగా ప్రభుత్వం తీసుకు న్న విధాన పర నిర్ణయాలు వ్యవసా య రంగంలో అరుదైన రికార్డులు న మోదు చేసుకోవడం రాష్ట్ర ప్రభు త్వం సాధించిన విజయాలకు తా ర్కాణంగా నిలిచి పోసిసన్నారు.
అదే సమయంలో నీటిపారుదల రంగాన్ని ఆధునికరించేందుకు వి నూత్న సంస్కరణలకు అంకురార్ప ణ చుట్టమన్నారు.నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, జానాపహాడ్ బ్రాంచ్ కెనాల్ తో పాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతాంగానికి సమృ ద్ధిగా నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

దానికి తోడు నాగార్జున సాగర్ ఎడ మ కాలువ తో పాటు మూ సి,శ్రీరాం సాగర్ స్టేజ్ 2 ద్వారా సమృద్ధిగా నీ రు అందిస్తున్నామన్నారు.అంతే కా కుండా ఇప్పటికే ఉన్న ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించడంతో పాటు అవసరమైన ప్రతి చోట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని కొత్త గా ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.ప్రధానంగా భూరికార్డులను ఆధునికరించి ప్ర జల్లో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితి లను నివారించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అ మలులోకి తెచ్చిందన్నారు.

ఇప్పటికే మూడు నుండి 22 మండ లాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులు విజయవంతం అయ్యాయని దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేం దుకు ఏర్పాట్లు జరుగుతున్నాయ న్నారు.అన్నింటికీ మించి మహిళ లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గాను మహాలక్ష్మి పథకాన్ని అమలు పరుస్తున్నామన్నారు.ఆర్టీసీ బస్సు లలో ఉచిత ప్రయాణం,500 రూపా యలకె గ్యాస్ సిలిండర్ పంపిణీ, గృ హజ్యోతి పధకం కింద ఉచితం గా 200 యూనిట్ల వరకు ఉచిత వి ద్యుత్ అందిస్తున్న విషయాన్ని ఆ యన గుర్తుచేశారు ఇందిరా మహి ళా శక్తి కేంద్రాలు , క్యాంటీ న్లు,స్వ యం సహాయక సంఘాలకు శ్రీనిధి పధకం ద్వారా రుణాలు అందించి వారి వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నామన్నారు

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కం డ్ల లో వెలుగులు నింపేందుకే అ ర్హులై న ప్రతి నిరుపేదకు 6 కిలోల చొప్పు న ఉచితంగా సన్న బియ్యం పంపి ణీ పధకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన సన్న బియ్యం పం పిణీ పథకం దేశ చరిత్రలోనే సువ ర్ణాధ్యాయంగా ఆయన అభివ ర్ణించారు. సాలీనా 13 వేల కోట్ల పై చిలుకు వ్యయంతో రాష్ట్ర వ్యా ప్తంగా 3.10 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో 84 శాతానికి ఉచితంగా నాణ్యమైన సన్నబి య్యం పంపిణీని చరిత్రాత్మక ఘ ట్టంగా ఆయన పేర్కొన్నారు.పేదల జీవితాల్లో విపలవాత్మకమైన మా ర్పు తీసుకు రావాలి అన్నదే ప్రభు త్వ లక్ష్యమన్నారు.

చౌక ధరల దుకాణాల ద్వారా సర ఫరాను మరింత సజావుగా సాగిం చేందుకు వీలుగా ఈ జూన్,జు లై, ఆగస్ట్ మసాలకు సంబంధించిన సరుకులను ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు

అర్హులైన ప్రతి ఒక్కరికి 18 కిలో లు, అంత్యోదయ లబ్ధిదారులకు 105 కిలోలు,అన్నపూర్ణ లబ్ధిదారులకు 30 కిలోల బియ్యం పంపిణీ ఒకే సారి అందిస్తున్నట్లు ఆయన తెలి పారు.అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు అందించను న్నట్లు ఆయన తెలిపారు.కొత్త తెల్ల రేషన్ కార్డు దారుల ధరఖాస్తు లు ఆమోదం పొందాయని ఆయన తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా కొనసాగుతుం దని, అర్హులైన వారందరికీ ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు.

అదే సమయంలో ప్రజా ఆరోగ్యాన్నీ దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ ద్వారా సంవత్సరానికి పది లక్షల రూపా యల వరకు ఉచితంగా వైద్య సేవ లు అందిస్తున్నా మన్నారు.తె లంగాణా రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కార్పొరేషన్ ద్వారా నూతనంగా ఆసుపత్రి లు,క్రిటికల్ కేర్ బ్లాక్స్,నర్సింగ్ కళా శాలలు నిర్మిస్తున్నామన్నారు.
వీటన్నింటికీ తోడు అతి ముఖ్యమై న యువతకు ఉపాధి, విద్యావకా శాలు మెరుగు పరిచి వారికి ఉపాధి అవకాశాలు కలిపించేందుకు గాను రాజీవ్ యువ వికాసం ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
అదే సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిం చడంతో పాటు షి-టీమ్స్,లీగల్ అవేర్ నెస్ ప్రోగ్రాములతో పిల్ల లకు,మహిళలకు రక్షణ ఏర్పాట్లు చేశామన్నారు

ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరాన్ని గ్లోబల్ హబ్ గా తీర్చి దిద్దేందుకు గాను గ్లోబల్ స మ్మి ట్,మిస్ వరల్డ్, బయో ఆసియా వంటి కార్యక్రమాలు నిర్వ హిం చామన్నారు. నగర అభివృద్ధిలో బా గామైన మెట్రో రైలు విస్తరణతో పాటు 30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రూట్ మ్యాప్ రూపొందించామన్నారు. జిల్లా స్థా యిలో అమలు జరుగుతున్న పధకాలపై ఆయన స్పందిస్తూ అ ధికారులు పారదర్శకంగా పని చేయాలని ఉద్బోధించారు.ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని సూచించారు
సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే జిల్లాలో 5 లక్షల 85 వేల 464 ఎక రాల వ్యవసాయ భూమి సాగులోకి వచ్చిందన్నారు.అందుకు అవస రమైన నీటిని నాగార్జున సాగర్ ఎడమకాలువ,మూసి,ఎస్.ఆర్.ఎస్.పి సెకండ్ ఫెస్ ల నుండి అంది స్తున్నామన్నారు.

జిల్లాలో ఎత్తిపోతల పథకాల పున రుద్ధరణ, కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతంగా కోనసాగు తున్నాయన్నారు.29.02 కోట్ల అం చనా వ్యయంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ,184.60 కోట్ల తో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్,52.11 కోట్లతో జాన పహడ్ బ్రాంచ్ కెనాల్ లను అధినికరిస్తున్నామన్నారు
దానికి తోడు హుజుర్నగర్, కోదాడ డివిజన్ లలో 13 కోట్ల అంచాన వ్యయంతో నూతన కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్ట బోతున్న ట్లు ఆయన తెలిపారు.ఒక్క సూ ర్యాపేట జిల్లాలోనే 50,992 ధా న్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 75 5.35 కోట్ల విలువ చేసే 3,25,601 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ ను గోలు చేసి 550.54 కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశామన్నా రు.

సన్నాలు పండించిన రైతులకు ప్ర భుత్వం క్వింటా ఒక్కింటికీ అందిం చే 500 రూపాయల బోనస్ కింద 7,128 మంది రైతులకు 25.17 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక్క సూర్యపేట జిల్లాలోనే 3 లక్షల 26 వేల 057 మంది రైతులకు ఉచి తంగా 6,258 మెట్రిక్ టన్నుల నా ణ్య మైన సన్న బియ్యాన్ని పంపిణీ చేశామన్నారు. ఈ జూన్ నుండి జూన్,జూలై,ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ ను ఒకేసారి అందించాలన్న కోణంలో 18,766 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీని ప్రారంభించామన్నారు

అర్హులైన వారందరికీ కొత్తగా తెల్ల రేషన్ కార్డుల మంజూరికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపద్యంలో సూర్యాపేట జిల్లా నుండి ప్రభుత్వా నికి అందిన 22,913 ధరఖాస్తు లకు గాను ఇప్పటి వరకు 9,529 ధరఖాస్తు లకు ఆమోదం లభించిం దన్నారు. అదే విదంగా ఇప్పటికే ఉన్న తెల్ల రేషన్ కార్డులలో కొత్తగా 45,701 మంది కుటుంబ సభ్యుల ను నమోదు చేశామన్నారు.
మహాలక్ష్మి పధకంలో భాగంగా ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసిన మహిళలకు 153.8 కోట్లు ఆదా అయ్యిందన్నారు.అదే విదం గా 1.62 లక్షల కుటుంబాలకు గ్యా స్ సిలిండర్ 500 రూపాయలకు మొత్తం 4.61 లక్షల సిలిండర్లు పంపిణీ చేశామన్నారు.

అంతే గాకుండా 607 మంది రైతు లకు 1,876 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ కై 3.58 కోట్లు సబ్సిడీ అందిం చినట్లు ఆయన వివరిం చారు.1,54,220 లక్షల మంది రైతులకు 116.42 కోట్ల వ్యయంతో ఉచిత విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. విద్యారంగంలో 20.40 కోట్ల వ్యయంతో 571 పా ఠశాలలను అడునికరించినట్లు ఆయన వెల్లడించారు. నీటిపారు దల రంగం నుండి విద్యావ్యవస్థ వరకు ప్రక్షాళన చేసి 2047 నాటికి తెలంగాణా రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలొనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.