–కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు
–కౌంటింగ్ కి 530 మంది అధికారు లు,సిబ్బందితో బందోబస్తు
— నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్
MlcElectionCounting: ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం- నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ యం.ఎల్.సి ఎన్నికల కౌంటింగ్ కు అర్జాల బావి వేర్ హౌస్ గోడౌన్స్ నందు ఏర్పాటు చేసిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహిం చేందుకు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చే సినట్లు నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. అవస రమైన ముందస్తు ప్రణాళికతో పా టు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్న పాటి అవాంఛనీయ ఘటనలు జర గకుండా దాదాపు 530 మంది అధి కారులు, సిబ్బందితో కట్టుదిట్టమై న బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుంద ని నలుగురు కంటే ఎక్కువగా గుం పులు గుంపులుగా తిరగటం చేయ కూడదని స్పష్టం చేశారు. అదేవిధం గా అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపు నకు హాజరు అయ్యే అధికారులు సెల్ ఫోన్లు, నిషేధిత వస్తువుల అ యిన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటల్స్, లిక్విడ్, వాటర్ బాటిల్ , పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే ప్రధాన ఏజెంట్లు, కౌంటింగ్ ఏజంట్లు, మీడియా ప్రతి నిధులు ఎన్నికల అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తప్పక వెంట ఉంచుకొని తనిఖీలు చేసే పో లీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. వాహనాలకు ట్రాపిక్ ఇ బ్బంది కలగకుండా కేటాయించిన పార్కింగ్ స్థలం లోనే వాహానాలు పార్క్ చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పా టించాలని సూచించారు.