Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yennam Srinivas Reddy: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

–ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Yennam Srinivas Reddy: ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy)హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రగుంట చెరువు అలుగు పారి క్రింది ప్రాంతాలకు నీరు అధికంగా వస్తుండడంతో గోల్ మజీద్ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు జలమయం అయ్యింది. మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ (Anand Goud) కౌన్సిలర్స్ జలీల్ , వేద వ్రత్ , పాష, నాయకులు సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో (lowlands)ఉన్న కొన్ని ఇండ్లల్లో నీరు రావడం తో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.