–అక్రమార్కులపై యోగి ఆదిత్య నాథ్ ఉక్కుపాదం
–అయోధ్య రేప్ కేసు’లో నిందితు డైన ఎస్పీ నేత ఎఫ్ఐఆర్ నమోదు
— మొయీద్ ఖాన్ పేరుతో ఉన్న బేకరీ బుల్డోజర్తో నేలమట్టం
Yogi Adityanath:ప్రజా దీవెన, ఉత్తర్ ప్రదేశ్: ఉత్త రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమార్కులపై యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. ఆదిత్యానా థ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం బుల్డోజర్ చర్యలను కొనసాగి స్తోంది. ఆగస్టు 2న ‘అయోధ్య రేప్ కేసు’లో (‘Ayodhya Rape Case’)నిందితుడిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో జిల్లా యంత్రాగం శనివారం బుల్డో జర్ యాక్షన్కు దిగింది. ఆయన పేరుతో ఉన్న బేకరీని బుల్డోజర్తో నేలమట్టం చేసింది.మొయీద్ ఖాన్ నడుపుతున్న బేకరిపై ఫుడ్ సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ రెయిడ్ చేశా రు.
బేకరిలో తయారైన ఉత్పత్తు లను పరీక్షించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. భదర్సాలో ‘ఎవోన్ బేకరి’ (‘Evonne Bakery’)పేరుతో దీనిని మొయిద్ ఖాన్ నడు పుతున్నారు. సీనియర్ సూపరిం టెండెంట్ ఆఫ్ పోలీస్ రాజకరణ్ నాయర్ ఒక బుల్డోజర్తో కలిసి బేకరి ఉన్న స్థలానికి చేరుకుని ప్రాపర్టీ మెజర్మెంట్ చేపట్టాను. అనంతరం బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. అక్రమంగా బేకరీని (bakery) నడుపుతున్నట్టు నిర్దారణ కావ డంతో దానికి సీల్ వేశామని, అనం తరం కూల్చివేత పనులు చేపట్టాని ఎస్డీఎం అశోక్ కుమార్ తెలిపా రు. ఒక చెరువు చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీగోడను సైతం అధికారులు కూల్చేశారు. అయోధ్య (‘Evonne Bakery’)లోని బదర్సా ప్రాంతంలో తన కు మార్తెపై అత్యాచారం జరగడంతో బాధితురాలి తల్లి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఇటీవల కలుసుకుని ఫిర్యాదు చేశారు. దీం తో జిల్లా యంత్రాగం వెంటనే రంగం లోకి దిగారు. అత్యాచారం కేసు నమోదు చేయడంలోనూ, తగిన చర్య తీసుకోవడంలోనూ జాప్యం చేసిన పోలీస్ చౌకీ ఇన్చార్జి, స్టేషన్ ఇన్చార్జిని సస్పెండ్ చేసారు. కేసు లో ప్రధాన నిందితుడైన మొయిద్ ప్రాపర్టీపై విచారణ చేపట్టారు. పార్టీ లతో సంబంధం లేకుండా క్రిమినల్స్ పై (Criminals) కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఇటీవల తెలిపారు.