Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ysrcp: వైఎ్సార్సీపీ ఆఫీసు కూల్చివేత

— అమరావతి లోని కేంద్ర కార్యాల యాన్ని కూల్చేసిన సిఆర్డిఏ
–విశాఖలోని వైసిపి కార్యాలయానికి నోటీసులు
–రాజకీయ కక్ష సాధింపులకు వెన్ను చూపేది లేదని జగన్ ట్వీట్
Ysrcp: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (ysrcp Congress party)కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారు లు కూల్చి వేయించారు. తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాల యం రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతుండగా ఈ భవన నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని సీఆర్డీఏ ( crda) అధికారులు వెల్లడిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున సుమా రు 5:30 గంటల సమయంలో కూ ల్చివేత పనులు మొదలయ్యాయి. భారీ బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు కొనసాగుతు న్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను (police)సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేస్తూ కూల్చివేయాలoటూ ఆదే శించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ (ysrcp)నాయకులు హైకోర్టను ఆశ్రయించి పిటీషన్లను దాఖలు చే శారు. పిటీషన్లను విచారణకు కొట్టు అనుమతించింది. ఇదిలా ఉంటే తాడేప‌ల్లిలో వైసీపీ కార్యా లయం కూల్చివేయ‌డంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించా రు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబుపై (Chandra Babu)తీవ్ర‌ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమన కాం డను మరోస్థాయికి తీసుకెళ్లారు.

ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు (High court) ఆదేశాలనూ బేఖాతరు చేశారు.రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపో యాయని ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటన లతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబా బు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏవిధంగా ఉండ బోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెది రింపు లకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ పార్టీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడు గా గట్టిపోరాటాలు చేస్తాం.దేశంలో ని ప్రజాస్వామ్య వాదులంతా చంద్ర బాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అంటూ జ‌గ‌న్ ట్వీట్ (tweet)చేశారు.
*మరో కార్యాలయానికి నోటీసులు..* తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని శనివారం ఉద‌యం కూల్చివేసిన విష‌యం తెలిసిందే. అయితే అదే క్రమంలో విశాఖ‌ప‌ట్నం ప‌రిధిలోని ఎండాడ‌లో ని వైసీపీ కార్యాల‌యానికి అధికారు లు నోటీసులు జారీ చేశారు. అను మ‌తులు లేకుండా నిర్మించార‌ని అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.దీనిపై వారంలోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని జీవీఎంసీ ఆదేశించింది. ఈ నేప‌ థ్యంలోనే అధికారులు కార్యాల‌యా నికి నోటీసులు అంటించారు. స‌ర్వే నెం. 175/4లో అనుమ‌తి లేకుండా నిర్మాణాలు చేప‌ట్టార‌ని నోటీసులో పేర్కొన్నారు. రెండు ఎక‌రాల స్థ‌లం లో నిర్మాణాలు చేశార‌ని అభ్యం త‌రం తెలిపారు.