గ్రూప్ -4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి
నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
గ్రూప్ -4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి
నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి
ప్రజా దీవెన: జూలై -1న ఉదయం 10 గంటల నుండి 12-30 గంటల వరకు , మధ్యాహ్నం 2-30 నుంచి 5 గంటల వరకు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో, ముందస్తుగా పరీక్షా సెంటర్లకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నందున అభ్యర్థులు గంట ముందుగా సకాలం లో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.పరీక్ష ప్రారంభానికి
15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 9.45 గంటలు దాటిన తర్వాత,
మధ్యాహ్యం 2.15 తరువాత ఎగ్జామ్ సెంటర్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలిపారు.
ఈ నిబంధన నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ లు,వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్ తో కూడిన కారు తాళాలు, నిషేధిత, విలువైన వస్తువులు తీసుకురావద్దని స్పష్టం చేశారు.. ఇంకా షూలు ధరించి రావొద్దని కేవలం చెప్పులతో మాత్రమే రావాలని ఆయన తెలిపారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ తరువాత మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 188 పరీక్షా కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు, 53 213 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అగుతున్నట్లు తెలిపారు. నల్గొండ డివిజన్ లో 110 పరీక్ష కేంద్రాల్లో 32117 మంది, మిర్యాలగూడ డివిజన్ లో 60 పరీక్ష కేంద్రాల్లో 16152 మంది, దేవరకొండ డివిజన్ లో 18 పరీక్ష కేంద్రాల్లో 4944 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అగుతున్నట్లు తెలిపారు. పరీక్షా నిర్వహణకు 38 రూట్ లు ఏర్పాటు చేసినట్లు,రూట్ అధికారులుగా తహశీల్దార్ లు,ఎం.పి.డి. ఓ లను,జిల్లా అధికారులను నియమించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రం ల చీఫ్ సూపరింటెడెంట్ లకు, లైజన్ అధికారులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.పరీక్ష కేంద్రం లో ఇన్విజీ లెటర్ లు సర్వీస్ కమిషన్ నిబంధనలు పాటించాలని అన్నారు. అభ్యర్థులు ప్రతీ సెషన్ ఎగ్జామ్ ముగిసిన తర్వాత ఓఎంఆర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు అందించి నామినల్ రోల్ పై వేలిముద్ర వేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు సంబంధిత అధికారులకు అభ్యర్థులు హల్ టికెట్ తో పాటు,ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు ఓటర్ గుర్తింపు కార్డు,ఆధార్ కార్డ్ లేదా ఎదైనా గుర్తింపు కార్డ్ చూపించాల్సి ఉంటుందని. తెలిపారు. ఒక వేళ అభ్యర్థి కాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.చీఫ్ సూపరింటెండెంట్ గది లో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పరీక్ష కేంద్రం లో పర్నిచర్,త్రాగు నీరు,విద్యుత్ సౌకర్యం వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అభ్యర్థులు ఓ.ఎం.ఆర్. షిట్ పై సూచనలు చదవాలని, హాల్ టికెట్ నెంబర్, ప్రశ్నా పత్రం నెంబర్ సరిగ్గా నమోదు చేయాలని అన్నారు
పరీక్షా హల్ లో ప్రతి అరగంటకు ఒకసారి బెల్ మోగుతుందని, చివరి 5 నిమిషాలను సూచిస్తూ వార్నింగ్ బెల్ మోగుతుందని,దీనికి అనుగుణంగా అభ్యర్థులు పరీక్ష రాయాలని కలెక్టర్ తెలిపారు.