Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

WhatsApp: వాట్సాప్ ప్రియులకు తీపికబురు, వాట్సాప్ పేమెంట్ సేవలపై పరిమి తులను ఎత్తేసిన కేంద్రం

ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రపంచ ప్రసార మాధ్యమాలతో సమానంగా ప్రాచుర్యం పొందిన వాట్సాప్ అంది స్తున్న పేమెంట్ సేవలపై ఇప్పటి వరకు ఉన్న పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తే సింది. ఆ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ వాట్సప్ ప్రియులకు తీపికబురు అందించింది.ఈ నేప థ్యంలో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీ స్ త్వరలోనే అందుబాటులోకి రా బోతోంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్‌ నకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ అంది స్తున్న పేమెంట్ సేవలపై పరిమితు లను ఎత్తేసింది. ఆ మేరకు తాజా గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ ఈ పేమెంట్ సర్వీస్ త్వరలోనే అందు బాటులోకి రాబోతోంది. ప్రస్తుతం భారత్‌లో కేవలం పది కోట్ల మంది మాత్రమే వాట్సాప్ పేమెంట్ సేవల ను వినియోగించుకుంటున్నారు. భారత్‌లో ప్రస్తుతం 50 కోట్ల మంది కి పైగా వాట్సాప్ సేవలను ఉప యోగించుకుంటున్నారు. గతంలో మెసేజింగ్ సేవలకు మాత్రమే పరి మితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సేవలను కూడా ప్రారం భించింది. అయితే వాట్సాప్ పే మెంట్ సేవలపై కేంద్రం ఆంక్షలు విధించింది.

2020లో వాట్సాప్ పేమెంట్ సేవలను కేవలం 4 కోట్ల మంది వినియోగించుకునేందుకే అవకాశం కల్పించింది. 2022లో ఆ పరిమితిని పది కోట్ల మందికి పెం చింది. తాజాగా ఆ పరిమితిని పూ ర్తిగా ఎత్తివేసింది. దీంతో త్వరలోనే వాట్సాప్ పేమెంట్ సేవలు అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ సేవలను ఉపయోగించుకోవా లంటే మీ ఐఓఎస్ లేదా ఆండ్రాయి డ్‌ లో వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్ ద్వారా పేమెంట్ చేయాలంటే భారత్‌లో అకౌంట్ ఉండాలి. అలాగే వాడుకలో ఉన్న డెబిట్ కార్డు ఉండాలి. వాట్సాప్‌లో కూడా చెల్లింపుదారు, లబ్ధిదారుల మధ్య లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతాయి.