JIO:టెలికాం రంగంలో రిలయన్స్ జియో (JIO)దూసుకుపోతున్న సంగతి అందరికి తెలిసందే. దేశంలో రోజురోజుకు తన నెట్వర్క్ను మరింతగా విస్తరించుకుంటూపోతోంది. తాజాగా ప్రవేశ పెట్టిన జియో ఫైబర్ (JIO)వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ జియో ఫైబర్ ప్లాన్లో అన్లిమిటెడ్ ఇంటర్నెట్తోపాటు ఉచితంగా ఓటీటీ, 800లకుపైగా ఛానెళ్లను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జియో ఎయిర్ఫైబర్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది జియో. 30 శాతం డిస్కౌంట్తో ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది. దేశంలో అతిపెద్ద నెట్వర్క్, అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న జియో ఫైబర్, జియో ఎయిర్ఫైబర్.. హోమ్ బ్రాండ్, ఎంటర్టైన్మెంట్ సర్వీసును యూజర్స్ కోసం అందిస్తోస్తుంది.
ఇక ఏకంగా 1.2 కోట్లకు పైగా ఇళ్లతో JioFiber/AirFiber 99.99% నాణ్యతతో కూడిన సర్వీస్ అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. భారతీయ గృహాలను డిజిటలైజ్ చేయడం, భారతదేశాన్ని డిజిటల్ సొసైటీగా మార్చడం వంటి ఈ వేగాన్ని మరింత పెంచడానికి, జియో మరింత గృహాలను కనెక్ట్ అయ్యేలా ప్రోత్సహించే ఒక మంచి ఆఫర్ను తీసుకోని వచ్చింది. సరసమైన JioAirFiber ప్లాన్లపై మరో 30% తగ్గింపు అందిస్తోంది. ఈ ఫ్రీడమ్ ఆఫర్ ద్వారా, కొత్త JioAirFiber వినియోగదారులు రూ. 1,000 ఇన్స్టాలేషన్ ఛార్జీ మినహాయింపు ద్వారా కొత్త కనెక్షన్లపై 30% తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుందని జియో తెలియ చేస్తుంది. ఈ ఆఫర్ కేవలం 26 జూలై నుండి 15 ఆగస్టు వరకు అమలు అవుతుందని జియో సంస్థ వారు తెలిపారు. ఇక కొత్త AirFiber కనెక్షన్ల కోసం 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపింది.
3 నెలల ప్లాన్ ఆఫర్ కింద అందించే ప్లాన్ ఖరీదు రూ. 2121. మరి ఇందులో ఇన్స్టాలేషన్ ఛార్జీ రూ. 1000 ఉంటుంది. మొత్తం ఈ ప్లాన్ తీసుకోవాలంటే రూ.3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆఫర్లో భాగంగా 30 శాతం తగ్గింపుతో ఇన్స్టాలేషన్ ఛార్జీ లను తగ్గించుకోవచ్చు . అన్ని ప్లాన్లపై జీరో ఇన్స్టాలేషన్ చెల్లుబాటు అవుతుంది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల చెల్లు బాటు ప్లాన్స్తో అందిస్తోంది జియో. జియో ఫైబర్ తీసుకోవాలి అనుకునే వారికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి.