Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Retirement Income: రిటైర్‌మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందడం ఎలా.. మతిపోగొడుతోన్న స్కీమ్స్..

Retirement Income: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది సేవింగ్స్ (Savings) గురించి ప్లాన్ చేస్తుంటారు. మరికొంత మంది అయితే రిటైర్‌మెంట్‌ (Retirement) గురించి పొదుపు చేస్తారు. కానీ ఇంకొంత మంది మాత్రం తక్కువ వయస్సులో ఉన్నప్పుడే పొదుపు చేయడం ప్రారంభించి 50 ఏళ్ల వయస్సులోనే పదవీ విరమణ చేస్తారు. ఆ సమయంలో కూడా వారు ప్రతి నెలా రూ.1 లక్ష వరకు పెన్షన్ (Pension) పొందవచ్చని చెబుతున్నాయి ఆయా మార్కెట్ వర్గాలు. అంతేకాదు ప్రతి నెలా ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలని చూస్తే, అందుకోసం ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుం దాం.

* సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్…

ఇందుకోసం సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అనేది మంచి ఎంపిక. దీనిలో మీరు మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Mutual fund Investments) నుంచి క్రమం తప్పకుండా డబ్బును విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. SWP మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ ఇస్తుంది. దీంతోపాటు మీ డబ్బు కూడా పెరుగుతుంది. అయితే దీనిలో కొంచెం ప్రణాళికతో పెట్టుబడి పెడితే, ముందుగానే రిటైర్ అవ్వవచ్చు. ఆ తర్వాత మీరు భారీగా పెన్షన్ పొందుతూ మీ మొత్తం జీవితాన్ని హాయిగా గడపవచ్చు. అందుకోసం మీరు 25 ఏళ్ల వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా రూ. 15,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్‌లో సగటున 10-15 శాతం రాబడి (Returns) అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ 10 శాతం సగటు రాబడిని పొందుతామని అనుకుంటే 25 సంవత్సరాలలో మొత్తం రూ. 45 లక్షలు పెట్టుబడి పెడతారు. దానిపై 1.55 కోట్ల రూపాయల వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా 50 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి దాదాపు రూ.2 కోట్ల కార్పస్‌ను పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో 50 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసి, ప్రతి నెలా రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవడం ప్రారంభించవచ్చు. ఈ విధంగా చేస్తే ఖాతాలో డబ్బు తగ్గుతుందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ కాలంలో మీ డబ్బు తగ్గడానికి బదులుగా క్రమంగా పెరుగుతూనే ఉంటుంది. 50 ఏళ్ల వయస్సు నుంచి ప్రతి నెలా రూ.1 లక్ష విత్‌డ్రా చేస్తే, తర్వాతి 20 ఏళ్లలో అంటే 70 ఏళ్ల వరకు, మీరు దాదాపు రూ. 2.40 కోట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు 20 సంవత్సరాల తర్వాత మీ ఖాతాను తనిఖీ చేసినప్పుడు, మీ మనీ తగ్గకుండా, డబ్బు పెరిగి దాదాపు రూ.3 కోట్లకు చేరుకుంటుంది.

* ఎలా పొందుతాము

ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నప్పటికీ తగ్గకుండా ఎందుకు పెరుగుతుందని చాలామంది అయోమయంలో ఉంటారు. వాస్తవానికి మీరు ఉపసంహరించుకునే డబ్బు మీ మొత్తం కార్పస్‌ (Corpus)పై మీకు వచ్చే వడ్డీలో దాదాపు సగం. అంటే మీ కార్పస్‌కు సగం వడ్డీ ఇంకా జోడించబడుతోంది. మీరు వడ్డీని పొందుతున్నా రు. అంటే రాబోయే సంవత్సరాల్లో దానిపై రాబడి ద్వారా మీ డబ్బు తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్లాన్ లో మీ వయస్సు 25 లేదా 30 ఏళ్ల ఉన్నప్పటి నుంచి సేవ్ చేసుకుంటే సులభంగా ఉంటుంది.