Ram Gopal Varma : ప్రజా దీవెన, ముంబై: నేనే రా జు, నేనే మంత్రి అనే కోణంలో వ్య వహరిoచే మోనార్క్ రాంగోపాల్ వ ర్మకు (ఆర్జీవీ) బిగ్ షాక్ తగిలింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూ డు నెలల జైలు శిక్ష విధిస్తూ జ్యుడీ షియల్ కోర్టు తీర్పు వెలువరించిం ది. అయితే కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాంగోపాల్ వర్మ సవాలు చేశారు. వర్మ వేసిన పిటిషన్ను మే జిస్ట్రేట్ కొట్టేయడంతో పాటు బెయి ల్ కు వీల్లేని అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ దర్శకుడు రాంగో పాల్ వర్మపై ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో జ్యుడీషియల్ కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలన్న వర్మ అభ్యర్థనను తోసి పుచ్చిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం గమనార్హం. రాంగోపాల్ వర్మకు చెందిన సంస్థ తమకు ఇచ్చి న చెక్కు బ్యాంకులో చెల్లలేదంటూ 2018లో ఓ కంపెనీ పెట్టిన కేసులో తాజాగా ఈ పరిణామం చోటుచేసు కుంది.
జనవరి 21న అంధేరీలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వైపీ పూజారి తీర్పును వెలువరి స్తూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెం ట్స్ యాక్ట్ నిబంధనల ప్రకారం రాం గోపాల్ వర్మ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు నిర్ధారిస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించారు. అలా గే ఫిర్యాదుదారుడికి మూడు నెల ల్లోగా రూ.3,72,219 చెల్లించాలని ఆదేశించారు. ఆర్జీవీ ఈ తీర్పును సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈ నెల 4న అప్పీల్ను తిరస్కరిస్తూ ఆయ నకు వ్యతిరేకంగా నాన్ బెయిల బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసేందుకు కూడా నిరాకరిం చారు. అయితే, ఆర్జీవీ కోర్టుకు హా జరై బెయిలుకు దరఖాస్తు చేసుకో వచ్చని న్యాయమూర్తి తెలపడం కొసమెరుపు.