Big Breaking :ప్రజా దీవెన, ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు లోని కొండ ప్రాంతంలో సుమారు 10వేల మం ది భద్రతా సిబ్బందితో మావోయి స్టులపై చేపట్టిన భారీ ఆపరేషన్ ఐ దవ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దండ కా రణ్యం దద్దరిల్లుతోంది. తెలంగాణ చత్తీస్గఢ్ సరిహద్దులో కర్రెగుట్టల దండకారణ్యం తుపాకీ గుళ్ల వర్షం, బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని కర్రి గుట్టలపై మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతు న్నారు. ‘ఆపరేషన్ కాగర్’లో భాగం గా పోలీసులు కూంబింగ్ నిర్వహి స్తున్నారు. ఐదవ రోజుకి కూంబింగ్ చేరుకుంది.
మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్గా కర్రె గుట్టలో కూంబింగ్ ఆపరేషన్ కొన సాగుతోంది. ఈ క్రమంలో మావో యిస్టులు, జవాన్లు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో 28 మంది మా వోయిస్టు మృతి చెందినట్లు సమా చారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వైమానిక దాడులతో పాటు శాటి లైట్ మ్యాప్తో మావోయిస్టుల స్థా వరాలను గుర్తించనున్నారు. కర్రెగు ట్టపై సుమారు 30 కిలోమీటర్ల మేర బలగాలు చేరుకున్నాయి. 8 హెలి కాప్టర్ల ద్వారా జవాన్లకి ఆయుధా లు, భోజనాలు, నీళ్ళు సరఫరా చే స్తున్నారు. ఎన్కౌంటర్ జరుగుతు న్న ప్రాంతాల్లో గుట్ట సమీప గ్రామ ప్రజలు బయటికి రావద్దని పోలీ సులు ఆంక్షలు విధించారు.
అక్కడి గిరిజనులు భయాందోళన గురవుతున్నారు. రాత్రి, పగలు డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కోసం ఏజెన్సీని బలగాలు జల్లెడ ప డుతున్నాయి. ఎప్పుడు ఏం జ రుగుతుందని తెలియని పరిస్థితి నెలకొంది. హెలిక్యాప్టర్ ద్వారా ఏరి యల్ సర్వేతో పాటు సమాచారంపై గోప్యత పాటిస్తున్నారు.
మూడు రాష్ట్రాల నుంచి 20 వేల మంది బలగాలు మోహరిం చగా, ఎంత మందినైనా రంగంలోకి దిం పేందుకు భద్రతా బలగాలు సిద్దం గా ఉన్నట్టు తెలుస్తోంది. శాంతి చర్చల లేఖలను పంపినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలే దు. మావోయిస్టులపై కాల్పులు ని లుపుదల చేయాలని నిరసన ర్యా లీలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే కర్రె గుట్టలపై కేంద్ర బలగాల దాడు లు నిలిపి వేయాలని, బ ల గాలను వెనక్కి పిలవాలని మావో యిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావు లు డిమాండ్ చేస్తున్నారు. పెవి లియన్ గ్రౌండ్ నుంచి పాత బస్టాం డు వరకు ర్యాలీ నిర్వహించారు.