Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Breakingnews : బిగ్ బ్రేకింగ్, కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం

బిగ్ బ్రేకింగ్, కొండ చరియలు విరిగిపడి 48మంది దుర్మరణం

Breakingnews:  ప్రజా దీవెన, పశ్చిమ ఆఫ్రికా: పశ్చిమ ఆఫ్రి కా దేశం మాలిలో మరో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు మా లి లోని ఉన్న ఓ బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పో యారు.అనేక మంది తీవ్రంగా గాయ ప డ్డారు. బాధితుల కోసం అన్వే షణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం.

ఆఫ్రికాలో బంగారం ఉత్పత్తి చేసే ప్రధాన దేశాలలో మాలి ఒకటి. ఇక్కడి గనులలో ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గని కూలిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం గమనార్హం.

స్థానిక అధికారులు ఈ సంఘటనను ధృవీకరించగా, కెనిబా గోల్డ్ మైనర్స్ అసోసియేషన్ మృతుల సంఖ్య 48గా పేర్కొంది. బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోందని పర్యావరణ సంస్థ అధికారి తెలి పారు.