Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Brutall Murder : దారుణం, భార్య ప్రియుడు, స్నేహితుడిని జంటహత్యలు చేసిన ఆ పోలీస్

Brutall Murder : ప్రజా దీవెన, లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో దారుణ సంఘట న చోటుచేసుకుంది. ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ తన భార్య ప్రియుడు, అతడి స్నేహితుడిని కత్తితో పొడిచి చంపాడు. దాడి సమయంలో అ డ్డుకునేందుకు ప్రయత్నించిన అత డి భార్య కూడా గాయపడింది. అ యితే జంట హత్యలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో ఈ సంఘటన జరి గింది.

తన భార్యకు ఆమె ప్రియు డు మనోజ్‌తో వివాహేతర సంబం ధం ఉందని పోలీస్‌ కానిస్టేబుల్‌ మహేంద్రకుమార్‌ అనుమానించా డు. దీంతో మార్చి 31న తన భార్య తో ఫోన్‌ చేయించి అతడిని రప్పిం చాడు. ఆమెను కలిసిన తర్వాత తిరిగి వెళ్తున్న మనోజ్‌ పై కత్తితో దాడి చేశాడు. సుమారు 20 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశా డు. మనోజ్‌ వెంట వచ్చిన అతడి స్నేహితుడు రోహిత్‌ లోధి మెడపై కత్తితో పొడిచి చంపాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నిం చిన భార్య కూడా గాయపడింది. ఆమె చేతి వేలు తెగింది.

ఇదిలా ఉండగా జంట హత్యల తర్వాత మనోజ్‌, రోహిత్‌ మృతదే హాలను లఖింపూర్‌లోని నగ్వా వం తెన సమీపంలో పోలీస్‌ కానిస్టేబు ల్‌ మహేంద్ర కుమార్‌ పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపో యాడు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో మహేంద్ర కుమార్ ఆచూకీ తెలుసుకుని అరెస్ట్‌ చేశారు. అతడి భార్యను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు.