Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Familydeaths : విషాదం, కలహాల కారణంగా కుటుంబం ఆత్మహత్య

విషాదం, కలహాల కారణంగా కుటుంబం ఆత్మహత్య

Familydeaths: ప్రజా దీవెన ఉత్తర్ ప్రదేశ్: కుటుంబంలో నెల కొన్న కలహాల కారణంగా కుటుంబం కుటుంబమే కాలగర్భంలో కలి సిపోయిన విషాద సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. నలుగురు పిల్లలను దారుణంగా చంపిన తర్వాత తండ్రి తానూ ఆ త్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన ఉత్తర ప్రదేశ్‌ లో ని షాజహాన్‌పూర్‌లో జరి గింది. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఫోరెన్సిక్ బృందంతో సహా భారీ పోలీసు బలగాలు సంఘటనా స్థ లానికి చేరుకున్నాయి. తండ్రి తన నలుగురు అమాయక పిల్లల గొం తు కోసి చంపి ఆ తర్వాత అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీ సులు మృతదేహాలను స్వాధీ నం చేసుకుని చర్యలు ప్రారంభించారు.

వివరాల్లోకి ఇలా ఉన్నాయి. రాజీవ్ కి నలుగురు పిల్లలు (ముగ్గురు కు మార్తెలు, ఒక కుమారుడు). అతని భార్య పుట్టింటికి వెళ్లింది. పిల్లలు అతడి వద్దే ఉన్నారు. బుధవారం రాత్రి రాజీవ్ తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రించాడు. రాజీవ్ తండ్రి బాబా ఇంటి బయట నిద్రిస్తు న్నా డు. గురువారం ఉదయం నిద్ర లే చిన ఆయన ఇంట్లోకి వెళ్లేందు కు తలుపులు తెరవడానికి ప్రయ త్నించగా లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు.

ఆ తరువాత బాబా ఏదో విధంగా ఇంటి లోపలికి చేరుకున్నాడు. లో పల ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. తన మనవడు, మన వళ్ళ రక్తంతో తడిసిన మృతదే హా లు అక్కడ పడి ఉన్నాయి. సమా చారం అందుకున్న పోలీసులు ఘ టనా స్థలానికి చేరుకున్నా రు. రాజీ వ్ తన 13 ఏళ్ల కూతురు స్మృతి, 9 ఏళ్ల కూతురు కీర్తి, 7 ఏళ్ల కూతురు ప్రగతి, 5 ఏళ్ల కొడుకు రిషబ్ లను గొంతు కోసి దారు ణంగా హత్య చేశాడు. రాజీవ్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.