బెంగాల్ లో దారుణం, సిలిండర్ పేలుడులో ఏడుగురి దుర్మరణం
Gascylinderblost: ప్రజా దీవెన బెంగాల్: పశ్చిమ బెం గాల్ లో ఘోర భారీ పేలుడు ప్రమా దం చోటు చేసుకుంది. పశ్చిమ బెం గాల్లోని దక్షిణ 24 పరగణాల జి ల్లాలోని పథార్ ప్రతిమలోని ఒక ఇంట్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో న లుగురు పిల్లలు, ఇద్దరు మహిళ లు సహా ఏడుగురు మృతి చెందా రు. ఈ మేరకు సంఘటనకు సం బంధించిన వివరాలను వెల్లడిస్తూ బెంగాల్ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు.
బెంగాల్ పథార్ ప్ర తిమ బ్లాక్లోని ధోలాహత్ గ్రా మం లో రాత్రి సమ యంలో జరిగిన పేలుడులో ఒక మహిళ కూడా గాయపడిందని ఆ యన చెప్పారు. మృతదేహాలన్నింటినీ వెలికితీయగా గాయపడిన మహిళను ఇంటి నుంచి రక్షించి ఆసుపత్రికి తరలించారని సుందర్ బన్ పోలీస్ జిల్లా ఎస్పీ కోటేశ్వరరావు పిటిఐకి తెలిపారు. అయితే మృతులoతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలి పారు.
ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, లోపల నిల్వ చేసిన బా ణసంచా మంటల్లో చిక్కు కున్న తర్వాత మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నామన్నా రు. పేలుడు సంభవించిన తర్వాత పరిస్థితి అదుపులో ఉందని, సహా యక చర్యలు పూర్తయ్యాయని వెల్లడిం చారు. సిలిండర్ పేలుడు తీవ్రతకు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైoదని, అర్ధరాత్రి భారీ శబ్దంతో పేలు డు సంభవించడంతో ఉలిక్కిపడ్డ స్థాని కులు భయబ్రాంతులకు గుర య్యారని తెలిపారు.
ప్రమాదం జరి గిన సమయంలో 11 మంది ఉన్నా రని పోలీసులు అంచనా వేస్తున్నా రు. కాగా ఈ ఇంటిని బాణాసంచా తయారీ కేం ద్రంగా ఉపయోగిస్తు న్నారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉం డగా ఇంటి లోపల బా ణసంచా తయారు చేస్తున్నారా లేదా అని తె లుసుకోవడానికి కూ డా ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తా మని మరొక అధికారి తెలిపారు.