helicopteraccident: ప్రజా దీవెన అమెరికా: అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఘోర హెలి కాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ సంస్థ యజమాని కుటుంబం మృత్యు వాత పడ్డ విషాద సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలో జరిగిన ఈ ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో ఓ టెక్ కంపెనీ సీఈవో, ఆయన కు టుంబం దుర్మరణం పాలైనట్లు అ క్కడి అధికారిక వర్గాలు వెల్లడించా యి.
జర్మనీకి చెందిన టెక్నాలజీ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబం తో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న హె లికాప్టర్ హడ్సన్ నది మీదుగా వె ళ్తూ ఒక్కసారిగా గింగిరాలు తిరుగు తూ తలకిందులుగా నదిలో కుప్ప కూలింది. అనంతరం మంటలు చె లరేగడంతో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురూ మృతి చెందారు.
మృతుల్లో ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతోపాటు హెలికాప్టర్ పైలట్ కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందా లు బోట్ల సాయంతో సహాయక చ ర్యలు ప్రారంభించాయి. హెలికాప్టర్ తలకిందులుగా నీళ్లలో కూరుకుపో యినట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ గాల్లో ఉండగానే దాని ఒక భాగం విరిగిపోయినట్టు చెప్పా రు.
Elicopter accident in America pic.twitter.com/IKCYHZT7Lr
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) April 11, 2025