Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

House Blost : కొనసాగుతోన్న ఉద్రిక్తత, నియంత్ర ణ రేఖవెంబడి మరోసారి కాల్పులు

House Blost : ప్రజా దీవెన, శ్రీనగర్‌: పహల్గాం ఉగ్ర దాడితో దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న వేళ పాకి స్థాన్‌ రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శన కొన సాగుతోంది. కాల్పుల విరమణ ఒ ప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడు తోంది. గురువారం రాత్రి జమ్ముకశ్మీ ర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైనికులపై కాల్పులు జరి పిన పాక్‌ ఆర్మీ మరోసారి అత్యుత్స హాన్ని ప్రదర్శించారు. శుక్రవారం రా త్రి జమ్ముకశ్మీర్‌తోపాటు లఢక్‌లో ని యంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత పోస్టులపై పాక్‌ సైనికులు ఫైరింగ్‌ జ రిపారని ఆర్మీ వర్గాలు వెల్లడించా యి. అయితే వాటిని సమర్ధవంతం గా తిప్పికొట్టామని అధికారులు తె లిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గా యాలు కాలేదని పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి కశ్మీర్‌లోని నియం త్రణ రేఖ వెంబడి ఎలాంటి కవ్విం పు లేకుండా పాకిస్థాన్‌ ఆర్మీ కాల్పు లు జరిపింది. భారత దళాలు కూ డా అదే స్థాయిలో స్పదించాయి. ఎ లాంటి ప్రాణనష్టం జరుగలేదని ఓ ప్రకటనలో వెల్లడించింది.

పాక్ సైన్యానికి ఎదురుదెబ్బ..
దాయాది పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ తగిలింది. పేలుడులో ఏడు గురు పాక్ సైనికుల హతమయ్యా రు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బ లూచిస్థాన్‌లో పాక్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

బలూచిస్థాన్‌లో శుక్రవారం జరిగిన శక్తివంతమైన పేలుడులో ఏడుగు రు పాక్ సైనికులు హతమ య్యా రు. రోడ్డు పక్కన బాంబు పేలడం తో వాహనంలో ప్రయాణిస్తున్న ఏ డుగురు పాక్ ఆర్మీ సిబ్బంది మర ణించారు.

బలూచ్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా లో ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామే అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటిం చింది. బలూచిస్థాన్‌లో పరిణామా లు వేగంగా మారుతున్నాయి. బ లూచ్ ప్రజలు ఇప్పటికే తమకు స్వాతంత్ర్యం కావాలని నినదిస్తూ పాక్ సైనికులు, అధికారులే లక్ష్యం గా బీఎల్ఏ దాడులకు పాల్పడు తోంది.
ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత…
భారత భద్రత దళాలు ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేశాయి.
పహల్‌గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాదులను ప ట్టుకునేందుకు భద్రతా దళాలు గా లింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితు ల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జ మ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివా సాలను పేల్చేశాయి.