రెండు లారీల మధ్య నిండుప్రాణాలు బలి
Lorrysaccident: ప్రజా దీవెన, తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ తిరుప తి జిల్లాలో దారుణం జరి గింది. రెండు లారీల మధ్య నిండు ప్రాణా లు బలయ్యాయి. లారీల మధ్య ఇరుక్కున్న వ్యక్తి మృతి చెందాడు. చంద్రగిరి మండలం, కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మృతుడు తవణం పల్లి మండలం, మారేడుపల్లెకు చెందిన డ్రైవర్ సౌందర్ రాజు (35) గా పోలీసులు గుర్తించారు. లారీని పార్క్ చేసి చూ సుకొనే క్రమంలో మరో లారీ ఢీకొ నడంతో లారీల మధ్య ఇరు క్కుని మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూనే మృతదేహాన్ని తిరు పతి రుయా మార్చురీకి తరలించారు.