Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MaoistEncounter భారీ ఎన్‌కౌంటర్‌, ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది మావోల హతం

భారీ ఎన్‌కౌంటర్‌, ఛత్తీస్‌గఢ్‌లో 30 మంది మావోల హతం

MaoistEncounter:  ప్రజా దీవెన, ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గ ఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసు కుంది. గురువారం ఉదయం బీజా పూర్‌-దంతెవాడ సరిహద్దులో భద్ర తా బలగాలు, మావోయిస్టుల మ ధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోలు హతమయ్యారు. ఒక జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పో యినట్లు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

బీజాపూర్‌ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం తో గురువారం ఉద యం 7 గంటల నుంచి భద్రతా బల గాలు నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపడు తుం డగా ఎదురు కాల్పులు చోటు చేసు కున్నాయి.

ఈ కాల్పుల్లో 30 మంది మావోలు హతమయ్యారు. ఘట నాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకు న్నట్లు బీజాపూర్‌ పోలీసు లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరే షన్‌ కొనసాగుతున్నట్లు తెలి పారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.