Murder : ప్రజా దీవెన రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తల్లీ కూతురు దారుణ హత్యకు గుర య్యారు. హుకుంపేట వాంబే కాల నీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం ఏలూరుకు చెందిన ఎండీ స ల్మా (38), ఆమె కుమార్తె సానియా (16)ను ఓ యువకుడు కత్తితో పొ డిచి హతమార్చాడు. హత్య జరి గిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. సా యంత్రం 3 గంటల సమయంలో బంధువులు ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఎటువంటి స్పందన లేకపో వడంతో అనుమానం వచ్చి కిటికీ లోంచి చూడగా మృతదేహాలు కని పించాయి.
వెంటనే వారు పోలీసు లకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ నరసింహ కిశోర్, ఏఎస్పీ సు బ్బరాజు, డీఎస్పీ విద్య, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ సంఘటనా స్థ లానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్ర లు సేకరించి కేసు దర్యాప్తు ప్రారం భించారు. సానియాను ప్రేమించిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమాని స్తున్నారు. అన్ని కోణాల్లోనూ పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు.