Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Murder : హత్య కేసులో పురోగతి, భార్య, అత్త కలిసి అతనిని హతమార్చారు

Murder : ప్రజా దీవెన , బెంగుళూరు : మానవత్వం మంటగలిసి మను షులు మృగాళ్ల లా మారుతున్న సంఘటనలు సమాజంలో కోకొ ల్లలుగా నిలుస్తున్నాయి. ఇందుకు బెంగుళూరులో జరిగిన హత్య కేసు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుం ది. బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో మిస్టరీ వీడడoతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుని భార్య, అత్త కలిసి అతనిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తే లింది. అతని వయసు 37 సంవ త్సరాలు కాగా, భార్య వయసు 19 సంవత్సరాలు. అత్త వయసు 37 సంవత్సరాలు. భర్తను హత్య చేసి న భార్యను, ఆమె తల్లిని పోలీసు లు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించా రు. లోక్నాథ్ (37), యశస్విని (1 9) మధ్య పెళ్లికి ముందే రెండేళ్లు రహస్య బంధాన్ని కొనసాగించారు. 2024లో ఈ ఇద్దరూ రిజిస్టర్డ్ మ్యా రేజ్ చేసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ ఇద్దరూ పెళ్లి చేసు కున్న విషయం యశస్విని కుటుం బానికి తెలియకుండా దాచారు.

ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉండటంతో వీళ్ల పెళ్లికి అమ్మాయి ఫ్యామిలీ ఏమాత్రం ఒప్పుకోలేదు. అయితే పెళ్లయిన విషయం దాచేసి యశస్వినిని ఆమె పుట్టింట్లో ఉంచే సి లోక్నాథ్ బెంగళూరు వెళ్లిపో యాడు. లోక్నాథ్కు బెంగళూరు లో పలువురు మహిళలతో వివా హేతర సంబంధాలు ఉన్నాయని యశస్వినికి తెలిసింది. ఈ విష యంలో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ గొడవలు స మసిపోయి కాస్త కాపురం గాడిన పడిందనుకునే సమయంలో లోక్ నాథ్లో ఉన్న శాడిస్ట్ యశస్వినికి నరకం చూపించాడు.

అతని అత్తను అంటే యశస్విని తల్లిని తనతో వివాహేతర సంబం ధం కొనసాగించేందుకు ఒప్పించా లని భార్యపై లోక్నాథ్ ఒత్తిడి తీసు కొచ్చాడు. భర్త ప్రవర్తనతో విసిగిపో యి యశస్విని పుట్టింటికి వెళ్లిపో యింది. కాల్ చేసి కూడా అత్తను అందుకు ఒప్పిస్తే ముగ్గురం హ్యాపీ గా కలిసి ఉందామని లోక్ నాథ్ టార్చర్ చేశాడు. భర్త అరాచకం రో జురోజుకూ పెరిగిపోవడంతో విసిగి వేసారిపోయి ఇక చంపేయాలని త ల్లితో కలిసి యశస్విని ప్లాన్ చేసిం ది. సరిగ్గా అదే టైంలో మార్చి 22న యశస్వినికి లోక్ నాథ్ కాల్ చేశా డు. శనివారం ఉదయం కలవడా నికి తాను వస్తున్నానని చెప్పాడు. ఉదయం 10 గంటలకు SUV వా హనంలో ఇంటి నుంచి లోక్ నాథ్ బయల్దేరి వెళ్లాడు. లోక్నాథ్ను చంపేయడానికి ఇదే సరైన సమ యమని యశస్విని, ఆమె తల్లి భావించారు.

లోక్నాథ్ వచ్చేలోపు అతని కోసం ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఆ ఫుడ్లో ని ద్ర మాత్రలు పొడి చేసి మిక్స్ చేశా రు. పార్టీ చేసుకోవాలని డిసైడ్ అ యిన లోక్ నాథ్ కొన్ని బీర్ బాటిల్స్ కొనుక్కుని మరీ భార్యను కలవడా నికి వెళ్లాడు. యశస్వినిని కారులో ఎక్కించుకున్నాడు. యశస్విని ఆ ఫుడ్ ను కూడా తన వెంట తీసుకె ళ్లింది. లోక్ నాథ్ తన భార్యను తీ సుకుని BGS లేఔట్ లో ఉన్న నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇద్ద రూ కలిసి SUVలో కూర్చుని బీరు తాగారు. మందు మత్తు ఎక్కగానే తినమని తన వెంట తెచ్చిన ఫుడ్ ను యశస్విని భర్తకు తినిపించింది. అది తిన్న కాసేపటికి లోక్ నాథ్ మ త్తులోకి జారుకున్నాడు. ఆ తర్వా త తన తల్లికి యశస్విని లొకేషన్ షేర్ చేసింది.

లోక్ నాథ్ మత్తులో ఉండగా య శస్విని తల్లి హేమ కత్తితో అల్లుడి గొంతులో రెండుసార్లు కసి తీరా పొడిచింది. దెబ్బకు మత్తు వదిలిన లోక్ నాథ్ అక్కడి నుంచి పారిపో యేందుకు ప్రయత్నించాడు. 150 మీటర్లు పరిగెత్తి.. ఆగి ఉన్న ఆటో లో దాక్కోవడానికి ప్రయత్నించా డు. అతని కేకలు, అరుపులు విన్న స్థానికులు అతని దగ్గరకు వెళ్లే లో పే తీవ్ర రక్త స్రావంతో లోక్ నాథ్ ప్రా ణాలు కోల్పోయాడు. అక్కడి నుం చి సైలెంట్ గా యశస్విని, అతని తల్లి తప్పించుకుని పారిపోయారు.