ప్రైవేట్ పార్ట్స్ లో రాళ్లు, బ్లేడ్ తో దారుణం
Rape : ప్రజాదీవెన, ముంబై: 20 ఏళ్ల యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాలడ్డాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో సర్జరీ బ్లేడ్, చిన్నచిన్న రాళ్లను చొప్పించాడు. ఈ దారుణం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడు రాజరతన్ వల్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
తన వాహనం ఎక్కిన బాధితురాలిపై గురువారం ఆటోరిక్షా డ్రైవర్ రాజ్ రతన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమె ప్రైవేట్ భాగాల్లో రాళ్లు, సర్జరీ బ్లేడ్ ను చొప్పించాడు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గురువారం అర్ధరాత్రి రామ్ మందిర్ స్టేషన్ సమీపంలో విడిచిపెట్టేసి పరారయ్యాడు. బాధితురాలు ఏడుస్తూ కనిపించడం వల్ల స్థానికులు వాన్రాయి పోలీసులకు సమాచారం అందించారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యం కోసం ముంబయిలోని కేఈఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధరించారు. వసాయ్ బీచ్లో బాధితురాలిపై నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ అత్యాచార ఘటన కేసుపై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్మితా పాటిల్ దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాజ్ రతన్ వాల్వాల్ను అదుపులోకి తీసుకున్నామని ఆమె తెలిపారు. అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.