–నేడు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ కు ఏర్పాట్లు ముమ్మరం
–తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లల్లో సంసిద్ధం
–ఎయిర్ రైడ్ సైరన్లు, క్రాష్ బ్లాక వుట్లు, పౌర శిక్షణ తో ప్రజల్లో అవగాహన పెంపు
–యాభై ఏళ్ల తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం మళ్ళీ ఇప్పుడే
Mock Drill :ప్రజా దీవెన, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్తో పెరు గుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేం ద్ర ఆదేశాల మేరకు బుధవారం దేశ వ్యాప్తంగా పౌరుల భద్రత సన్నద్ధత ను పరీక్షించే మాక్డ్రిల్స్ నిర్వహణ కు సర్వం సిద్ధమైంది. యుద్ధమం టూ ఆరంభమైతే 33 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులకు గురయ్యే ప్రమాదం ఉన్న 244 జి ల్లాల్లోని అత్యంత సున్నితమైన 29 ప్రాంతాల్లో వీటిని నిర్వహించను న్నారు. అందులో భాగంగా తెలం గాణలో హైదరాబాద్, ఏపీలో విశా ఖ, బాపట్ల ఉండడం గమనార్హం. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఈ మాక్ డ్రి ల్ నిర్వహణకు సంబంధించి మంగ ళవారం అత్యున్నతస్థాయి సమావే శం జరిగింది. అత్యంత కీలకస్థానా ల్లో విధులు నిర్వహిస్తున్న పలువు రు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ భేటీలో పాల్గొని చర్చించారు.
1971లో పాకిస్థాన్తో యుద్ధం జరిగేటప్పుడుదేశంలో ఇలాగే మా క్ డ్రిల్ నిర్వహించారు. మళ్లీ 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి కసరత్తే జరగనుంది. ఇంతకీ ఏమి టీ మాక్ డ్రిల్ అంటే యుద్ధ సమ యంలో ప్రజలు, రక్షణ, విపత్తు స్పందన, ప్రభుత్వ సిబ్బంది ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇవ్వడం ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అం దులో భాగంగా పలు చర్యలు చేప డతారు.
ఎయిర్ రైడ్ సైరన్లు… వైమాని క దాడులు జరిగే ప్రమాదం ఉన్న ప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే సైరన్లు. ఆ సైరన్ మోగిందంటే ము ప్పు ముంచుకొస్తున్నట్టే. ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాల్లో తలదా చుకోవాలి. ఇంట్లోనే ఉండాలి
క్రాష్ బ్లాకవుట్స్.. యుద్ధ సమ యాల్లో రాత్రి వేళల్లో వైమానిక దా డులు జరగకుండా విద్యుద్దీపాలన్నీ ఆర్పేసి కారుచీకట్లు కమ్ముకునేలా చేయడం. 1971లో జరిగిన బంగ్లా దేశ్ విమోచన యుద్ధంలో ఈ వ్యూ హాన్ని విస్తృతంగా వినియోగించా రు.
కేమోఫ్లేజ్ మెజర్స్… పాకిస్థా న్తో 1971లో యుద్ధం జరిగిన సమయంలో శత్రువుల విమానాలు మన తాజ్మహల్పై దాడులు చే యకుండా దాన్ని జనపనార తాళ్ల తో కప్పి ఉంచారు. అలా కీలక, చా రిత్రక కట్టడాలను, సైనిక కేంద్రాలు, సమాచార టవర్లు, విద్యుత్ కేం ద్రాల వంటివాటిని శత్రువుల కంట పడకుండా చేసి, వాటిని కాపాడు కునే ప్రక్రియ ఇది.
తరలింపు చర్యలు… ఇది అం దరికీ తెలిసిందే. వరదలు వచ్చిన ప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ట్టుగా యుద్ధ సమయంలో పౌరు లను హైరిస్క్ జోన్ల నుంచి సేఫ్ జోన్లకు తరలిస్తారు.
పౌర శిక్షణ… యుద్ధ సమ యాల్లో ఎలా ప్రవర్తించాలో పౌరు లకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం పాఠశాలు, కార్యాలయాలు, క మ్యూనిటీ సెంటర్లలో వర్క్షాప్లు నిర్వహిస్తారు. వారు ఉన్న చోట దా డి జరిగినప్పుడు తలభాగాన్ని ఎ లా కాపాడుకుంటూ నేలపై కూర్చుం డిపోవాలి, సమీపంలోని ప్రభుత్వ షెల్టర్లను ఎలా గుర్తించాలి, ప్రాథ మిక చికిత్స ఎలా చేయాలి ఎలాం టి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఒత్తిడికి, భయాందోళనలకు గురి కాకుండా ఎలా ఉండాలి వంటి అం శాలను ఆ వర్క్షాపుల్లో బోధిస్తా రు.
ఇదిలా ఉండగా ఇలా మాక్ డ్రిల్ నిర్వహించడం వల్ల నిజంగా యు ద్ధం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించా లో, ప్రాణాలు కాపాడుకోవాలో ప్రజ లకు తెలుస్తుంది. ఈ శిక్షణతో గంద రగోళానికి గురి కాకుండా, క్రమశిక్ష ణతో మెలగడం అలవడుతుంది. అదే సమయంలో అటు ప్రభుత్వ విభాగాలకు కూడా ఎక్కడెక్కడ ఏయే లోపాలున్నాయో తెలుసుకు ని వాటిని సరిదిద్దుకునే వీలు కలు గుతుంది. ఎయిర్ రైడ్ వార్నింగ్ సిస్టమ్స్ (శత్రు దాడుల గురించి హె చ్చరించే వ్యవస్థలు) ఎంత సమర్థం గా పనిచేస్తున్నాయి కంట్రోల్ రూ ములు, షాడో కంట్రోల్ రూముల పనితీరు ఎలా ఉంది వంటి అం శాలపై ఒక స్పష్టత వస్తుంది. అం దుకే కేంద్ర ప్రభుత్వం ‘సివిల్ డిఫెన్స్ రూల్స్, 1968’ ప్రకారం ఈ మాక్ డ్రిల్ నిర్వహణకు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం మాక్ డ్రిల్ ని ర్వహించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తాము గమనించిన లో పాలు, వాటిని సరిదిద్దుకోవ డానికి అవసరమైన సూచనలు, సిఫారసు లతో కేంద్ర ప్రభుత్వానికి ‘యాక్షన్ టేకెన్ రిపోర్టు’లు సమర్పిస్తాయి.
మోదీ కీలక సమావేశం…. పహల్గాం ఉగ్రదాడికి గట్టిగా బదు లివ్వాలని భారత్ భావిస్తున్న తరు ణంలో కీలక సమావేశాలు, చర్చలు కొనసాగుతున్నాయి. ఇందులో భా గంగా మంగళవారం ప్రధాని మోదీ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ సమావేశమయ్యా రు. వీరిద్దరి మధ్య భేటీ జరగడం 48 గంటల్లో ఇది రెండోసారి కావ డం గమనార్హం. కాగా, మోదీ ఇప్ప టికే రక్షణ మంత్రి రాజ్నాథ్, సీడీఎ స్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో కూడా సమావేశ మయ్యారు.