Road Accident :ప్రజా దీవెన, కరాచీ: దాయాది పాకిస్థాన్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయ లో పడిన ఘటనలో 16మంది మ రణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. సుమారు 30మంది గాయపడ్డారు. సింధు ప్రావిన్సులోని జామ్షోరో జి ల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. అతి వేగం తో వెళ్తున్న డ్రైవర్ బస్సును అదు పు చేయలేకపోయినట్లు తెలుస్తోం ది.
సంఘటనా స్థలంలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పంజాబ్ ప్రావిన్సులోని కొల్హి తెగకు చెందిన వ్యక్తులు సింధు ప్రావిన్సుకు వెళ్తు న్నారు.పోలీసులు, రెస్క్యూ బృం దాలు సంఘటనా స్థలానికి చేరు కున్నాయి. ప్రమాద బాధితులను సమీప ఆస్పత్రికి తరలించారు. బలూచిస్తాన్ లో గోధుమ పంట కోత తర్వాత కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి వెళ్తున్న సమ యంలో బస్సు ప్రమాదానికి గురైం ది. మృతుల సంఖ్య పెరిగే అవ కాశం ఉన్నది. గాయపడ్డ వారిలో చాలా మంది ఆరోగ్యం విషమంగా ఉన్నది.