Road Accident :ప్రజా దీవెన నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గు డ్లూరు మండలం చేవూరు జాతీ య రహ దారిపై ఘోర రోడ్డు ప్ర మాదం చోటు చేసుకొని ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టగా ఈ ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి కరీంనగర్ వెళుతున్న కారు చేవూరు రోడ్డు వద్ద ద్విచక్ర వాహ నాన్ని ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం లో వెళుతున్న రావూరు కి చెందిన సరస్వతి,వెంకటేశ్వర్లు లలో వెంక టేశ్వర్లు(54) అక్కడికక్కడే మృతి చెందగా కారులో పయనిస్తున్న అధ్విక రాజ్(4)అనే పాప మృతి చెందిoది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయా లు కాగా కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.