ఘోర రోడ్డు ప్రమాదం, ఇరువురి దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, విశాఖ పట్నం: విశాఖ పట్నం కూర్మన్నపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ డిపో ఎదురుగా గురు వారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు అక్కడిక క్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భారీ టిప్పర్ వాహనాన్ని తప్పించబోయి ద్విచక్ర వాహన దారులు కింద పడిపోయా రని అదే సమయంలో వెనకనుంచి వస్తు న్న ఆర్టిసి బస్సు వాళ్ల తలపై నుంచి వెళ్లిపోవడం వల్ల ఘటనా స్థ లంలోనే చనిపోయారని తెలిపారు.
ఘటన స్థలానికి పోలీసులు చేరు కుని మృత దేహాలను కేజీహెచ్ హా స్పిటల్ కి తరలించారు. మృతు లు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు దువ్వాడ పోలీసు లు.