RoadAccident : బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం
బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, రాజస్థాన్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు పై లారీ ట్రాలీ పడ టంతో నుజ్జును జ్జు అయ్యి కారులోని ఆరుగురు వ్యక్తులు అక్కడి కక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బికనీర్ లోని దేశ్ఋ నోక్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది. ఓ కారులో మహిళ సహా ఆరుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హా జరై తిరిగి వస్తున్నారు. కారు దేశ్ నోక్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే పక్కనే లోడ్ తో వెళుతున్న ఓ ట్రక్ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, కారుపై పడగా కారు నుజ్జు నుజ్జు అయ్యింది.
ఘటనపై సమాచారం అందుకున్న దేశ్ నోక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహ యక చర్యలు చేపట్టారు.ఒక క్రేన్, మూడు జేసీబీల సహాయంతో ట్రా లీని తొలగించారు. కారు మొత్తం ట్రాలీలో ని బూడిదతో నిండిపోయిం ది. కారులో ప్రమాదానికి గురైన వ్య క్తుల ను బయటికి తీసి, అంబులెన్స్ లో పీఎంబీ ఆసుపత్రికి తరలించా రు. కానీ వారు అప్పటికే మృతి చెం దినట్లు డాక్టర్ వెల్లడించారు.
ఘట నపై పోలీస్ అధికారి సునీల్ మా ట్లాడుతూ కారులో ఓ మహి ళ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నా రని, వీరంతా మరణించినట్లుగా డాక్టర్ చెప్పారని తెలిపారు. చని పోయిన వారు వివాహానికి హాజరై తిరిగి వస్తున్నట్లుగా గుర్తించామని, ప్రస్తుతానికి మృతులను గుర్తించ లేదని, మృతదేహాలను పీఎంబీ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచా మని చెప్పారు.