Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Roadaccident : తప్పిన పెను ప్రమాదం, శబరి పంపానది వద్ద అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

తప్పిన పెను ప్రమాదం, శబరి పంపానది వద్ద అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Roadaccident ప్రజా దీవెన, హైదరాబాద్:హైదరాబాద్ పాతబ స్తీ మదన్న పేట ఉప్ప ర్ గూడా కి చెందిన అ య్యప్ప స్వాముల బస్సు శబరి పంపానది కి 15కిలోమీటర్ల దూరం లోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది.ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తున్న గురు స్వామి రాంపాల్ యాదవ్, అభి యాద వ్,రామ్ యాదవ్ పెద్ది యాదవ్ ల అద్వర్యం వెళ్తున్న అయ్యప్ప స్వా ములు బస్సు ఘాట్ రోడ్డు మలు పులో అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన బస్సు మూడు భారీ చెట్ల పై ఒరగడంతో పెను ప్రమాదం తప్పింది.

బస్సులో ఉన్న 22 మంది అయ్యప్ప స్వాములు స్వల్ప గాయాలతో బయటపడ్డా రు.క్షతగాత్రులను కొట్టాయం మెడి కల్ కాలేజి ఆసుపత్రి కి తరలిం చారు.తీవ్రగాయాలు పాలైన డ్రైవ ర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు.
*స్వాములoదరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు…* కొట్టా యం నుండి శబరిమలకు వెళు తున్న యాత్రికుల వాహనం బోల్తా పడి ఒకరు మృతి, 8మందికి తీవ్రా గాయాలు క్షతగాత్రులను మెరు గైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించా రు.
హైదరాబాద్ పాతబస్తీ మదన్న పేట ఉప్పర్ గూడా కు చెందిన అ య్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం కొట్టాయం కనమల అట్టి వలం వద్ద ప్రమాదానికి గురైంది. వాహనంలో 22 మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. ఈ ఘటనలో వాహనం డ్రైవర్ రాజు(51) మృతి చెందాడు. మృతదేహాన్ని పంపాడి తాలూకా ఆసుపత్రిలో ఉంచారు ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొట్టాయం మెడికల్ కాలేజీ ఆస్ప త్రికి తరలించారు.వాహనం వక్ర మార్గం కిందకు దిగుతుండగా అదు పు తప్పి వాహనం బోల్తా పడిం ది.